Last Updated:

Hafiz Saeed: హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్థాన్‌ను కోరిన భారత్

లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.

Hafiz Saeed: హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. పాకిస్థాన్‌ను కోరిన భారత్

Hafiz Saeed: లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను అధికారికంగా అభ్యర్థించింది.సయీద్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వర్గాలు ధృవీకరించాయి.

2008 ముంబై దాడుల్లో..(Hafiz Saeed)

సయీద్ భారతదేశం యొక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరిగా జాబితాలో ఉన్నాడు. 2008 ముంబై దాడుల్లో అతని ప్రమేయం ఉన్నందుకు అమెరికా అతని తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.ముంబై దాడులకు సంబంధించి విచారణను ఎదుర్కొనేందుకు సయీద్‌ను అప్పగించాలని భారతదేశం పదేపదే డిమాండ్ చేసింది, అయితే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య అప్పగింత ఒప్పందం లేకపోవడం ప్రక్రియను క్లిష్టతరం చేస్తోంది. సయీద్ సంవత్సరాలుగా అనేక చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొన్నాడు.అతను మొదట జూలై 2019లో అరెస్టయ్యాడు. గత ఏడాది ఏప్రిల్‌లో, ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేసిన కేసులో పాకిస్థాన్ కోర్టు సయీద్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు పత్రాలు చూపించాయి. అయితే, అతను జైలులో ఉన్నాడా అనేది అస్పష్టంగా ఉంది. 2017లో గృహనిర్బంధం నుండి విడుదలైన తర్వాత అతను స్వేచ్ఛగా సంచరిస్తున్నాడని తెలుస్తోంది. సయీద్ గత దశాబ్దంలో అనేకసార్లు అరెస్టు చేయబడి విడుదలయ్యాడు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను ఉగ్రవాదిగా గత ఏడాది భారత్ ప్రకటించింది. ఇప్పుడు, తల్హా సయీద్ తన తండ్రి స్థాపించిన రాజకీయ పార్టీ అయిన పాకిస్తాన్ మర్కాజీ ముస్లిం లీగ్ (PMML) తరపున పాకిస్తాన్‌లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు.