Last Updated:

Delhi: దీపావళికి బాణాసంచా కాల్చడం, అమ్మడంపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం

దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.

Delhi: దీపావళికి బాణాసంచా కాల్చడం, అమ్మడంపై   నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం

 Delhi: దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.

దీపాలతోనే జరుపుకోవాలి.. ( Delhi)

సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రాయ్ మాట్లాడుతూ నగరమంతటా నిషేధాన్ని అమలు చేయాలని ఢిల్లీ పోలీసులకు కఠిన ఆదేశాలు ఇస్తామని చెప్పారు. గత మూడేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడినప్పటికీ రాయ్ పేర్కొన్నారు. గత ఐదారేళ్లలో ఢిల్లీ గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదల కనిపించింది, అయితే మేము దానిని మరింత మెరుగుపరచాలి. అందువల్ల, ఈ సంవత్సరం కూడా పటాకులను నిషేధించాలని మేము నిర్ణయించుకున్నామని రాయ్ చెప్పారు.పటాకుల లైసెన్సుల మంజూరును మానుకోవాలని ఎన్‌సిఆర్ రాష్ట్రాల అధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మత విశ్వాసాలను జరుపుకోవాలని చెప్పిన రాయ్, దీపావళిని దీపాలతో జరుపుకుంటామని తెలిపారు.

దీపావళి సమీపిస్తున్న తరుణంలో శీతాకాల కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలతో కాలుష్య హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణను కూడా ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు.దీపావళి సందర్భంగా ఎవరైనా పటాకులు పేల్చితే ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది.ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు జరిపితే పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9బీ కింద రూ. 5,000 వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.