Last Updated:

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు ‘మోదీ, మోదీ’ నినాదాలతో స్వాగతం

  ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వడోదర విమానాశ్రయంలో 'మోదీ, మోదీ' నినాదాలతో కొందరు స్వాగతం పలికారు. అయితే కేజ్రీవాల్ దీనిపై పెద్దగా స్పందించకుండా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు ‘మోదీ, మోదీ’ నినాదాలతో స్వాగతం

Gujarat: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు వడోదర విమానాశ్రయంలో ‘మోదీ, మోదీ’ నినాదాలతో కొందరు స్వాగతం పలికారు. అరవింద్ కేజ్రీవాల్ ఎయిర్‌పోర్ట్ గేట్ నుండి బయటకు రాగానే, ప్రధానమంత్రి పేరును జపిస్తూ ప్రజలు మోదీ నినాదాలతో హోరెత్తించారు. అయితే కేజ్రీవాల్ దీనిపై పెద్దగా స్పందించకుండా తన వాహనం ఎక్కి వెళ్లిపోయారు.

అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో ఒక రోజు పర్యటనలో ఉన్నారు. ఈ రోజు ఆయన వడోదరలో టౌన్ హాల్ సమావేశంలో ప్రసంగిస్తారు. బీజేపీ పాలిత గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలతో మమేకమయ్యేందుకు కేజ్రీవాల్ ఇటీవలి కాలంలో అనేకసార్లు గుజరాత్ ను సందర్శించారు.

ఇటీవలి కాలంలో గుజరాత్‌లో తన పర్యటనల సందర్భంగా, కేజ్రీవాల్ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలు మరియు నిరుద్యోగ యువతకు భత్యాలు, ఉచిత మరియు నాణ్యమైన వైద్యం మరియు విద్య మరియు ఉద్యోగాల కల్పనతో సహా అనేక “హామీలు” ప్రకటించారు. .

ఇవి కూడా చదవండి: