Last Updated:

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు..

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో  తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా..  ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది.

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ కు నోటీసులు..

Nara Lokesh : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో  తెదేపా ముఖ్య నేత నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతేడాది కేసు నమోదవ్వగా..  ఇటీవలే ఏ14గా లోకేశ్ పేరును సీఐడీ అధికారులు చేర్చారు. అక్టోబరు 4వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేశ్ హైకోర్టును ఆశ్రయించగా.. తాము 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ చెప్పడంతో హైకోర్టు లోకేశ్ బెయిల్ పిటిషన్ విచారణను ముగించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో తాను ఎక్కడున్నదీ నారా లోకేశ్ స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఏపీ సీఐడీ అధికారులు ఈ మధ్యాహ్నం ఆయనకు నోటీసులు ఇచ్చారు. తొలుత వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ అధికారులు, ఆ తర్వాత లోకేశ్ తాను ఎక్కడున్నదీ చెప్పడంతో గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.