Last Updated:

Warangal :గులాబీ పార్టీకి వరంగల్ గుబులు

హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్‌లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది.

Warangal :గులాబీ పార్టీకి వరంగల్ గుబులు

Warangal: హైదరాబాద్ తరువాత పెద్దనగరంగా ఉన్న వరంగల్‌లో గులాబీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల ఇద్దరు సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పార్టీనీ వీడారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారే కాలానికి తగ్గట్లు కొన్ని మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి అన్నట్లుగా ఇప్పుడు అలాంటి పరిస్థితే వరంగల్ గులాబీ పార్టీలోనూ నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నుంచి గులాబీ పార్టీకి కాస్తంత పట్టు ఉన్న జిల్లాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఒకటి. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఈ జిల్లా టీఆర్ఎస్‌కు కంచుకోటలా మారింది. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ భారీ ఆధిక్యతను అందించింది వరంగల్ జిల్లానే.

ప్రస్తుతం ఉన్న బలాన్ని చూసినప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్ఎస్ గుప్పిట్లోనే ఉన్నాయి. ఇవే కాక.. ఎనిమిది ఎమ్మెల్సీలు.. ఆరు జిల్లా పరిషత్ లను సొంతం చేసుకొని.. మిగిలిన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం అందనంత అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి వేళ.. కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు.. అధికార పార్టీలో నెలకొన్న అధిపత్య పోరు.. వెరసి గులాబీ పార్టీ మీద వ్యతిరేకత మొదలై.. ఇతర పార్టీలకి ఆధిక్యత అంతకంతకూ ఎక్కువ అవుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయివరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా.. వీటిలో ఇప్పుడు పలు అసెంబ్లీ స్థానాల్లో ఇతర పార్టీలు బలపడ్డాయన్న సర్వే రిపోర్టులు గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉమ్మడి జిల్లాలోని పలు అసెంబ్లీ స్థానాలు ఇతర పార్టీలకు వెళ్లిపోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దీంతో.. సిట్టింగు ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనేది టీఆర్ఎస్ శ్రేణుల మాటే. ఎన్నికల్లో గెలుపు మీద ఫోకస్ పెట్టిన గులాబీ బాస్‌కు.. గెలుపే అంతిమ లక్ష్యమైనప్పుడు.. సిట్టింగుల విషయంలో ఆయన కరకుగా వ్యవహరించటానికే ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది.

ఇటీవల టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశాల్లోనూ గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసిన కేసీఆర్ మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్న అధికార పార్టీ నేతలకు ఇప్పుడు కంటి మీద కనుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో జరిపిన పలు సర్వేల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఫలితాలు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో సిట్టింగుల్లోనూ టెన్షన్ మొదలైనట్లు తెలిసింది. రోజులు గడిచే కొద్దీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇతర పార్టీలు అంతకంతకూ బలపడుతున్నాయనే మాట వినిపిస్తోంది. పలువురు నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లుగా వస్తున్న వార్తలు టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్నాయి. మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేల్లో.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే,ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ..వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మినహా మిగిలిన వారి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్నట్లుగా సర్వే రిపోర్టులు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.సర్వేల్లో ఆదరణ కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతున్న సిట్టింగులు తమ స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా.. పలు కార్యక్రమాల్ని చేపడుతున్నారు. రానున్న కొద్ది నెలల్లో తమ గ్రాఫ్ ను మెరుగుపరుచుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. పలువురు మాజీలను కొత్తగా బరిలోకి దింపే ఆలోచన గులాబీ బాస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పోటీ మరింత పెరిగి.. ఎవరికి వారు తామే తగిన అభ్యర్థి అన్న భావన కలిగేలా ప్రయత్నిస్తున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ నాయకుల మధ్య అధిపత్య పోరు చాలా ఎక్కువ కావడంతో క్యాడర్‌ గందరగోళంలో పడిపోయారట. ఏ నాయకునితో టచ్‌లో ఉంటే ఎన్ని చిక్కులు వస్తాయో అని అయోమయంలో పడిపోతున్నారట. అధికార పార్టీ నేతలను అధిష్టానం ఎలా గడినా పెడుతుందో…రానున్న రోజులలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాను ఏవిధంగా హ్యాండిల్ చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి: