Last Updated:

London: లండన్ లో తెలుగు యువతులపై ఉన్మాది దాడి

బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మృతి చెందింది.

London: లండన్ లో తెలుగు యువతులపై ఉన్మాది దాడి

London: బ్రిటన్ రాజధాని లండన్ లో దారుణం చోటు చేసుకుంది. విదేశీ విద్య కోసం లండన్ లో ఉంటున్న ఇద్దరు తెలుగు యువతులపై ఓ ఉన్మాది దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక యువతి
అక్కడికక్కడే మృతి చెందింది. భారత కాలమాన ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు తేజస్విని రెడ్డి, అఖిల అనే ఇద్దరు తెలుగు అమ్మాయిలపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తేజస్విని అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి అఖిలకు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

 

త్వరలో ఇండియాకు..అంతలోనే(London)

కాగా, హైదరాబాద్ కు చెందిన తేజస్విని రెండేళ్ల క్రితం ఎంఎస్ చదవడం కోసం లండన్ వెళ్లింది. యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్ విచ్లో చదువుతోంది. అక్కడ వెంబ్లి ప్రాంతంలో మరికొందరు స్నేహితులతో కలిసి ఉంటోంది. త్వరలో ఇండియాకు రావాల్సి ఉందని.. ఇంతలోనే ఘోరం జరిగిందని తేజస్విని కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వైపు దాడి చేసిన బ్రెజిల్ వ్యక్తి కూడా తేజస్విని అపార్ట్ మెంట్ లోనే ఉంటాడని తెలుస్తోంది. దుండగుడి దాడిలో గాయపడిన మరో యువతి అఖిల ది జనగాం జిల్లా ఆలేరుగా గుర్తించారు.