Last Updated:

Jharkhand: జార్ఖండ్ లో బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా విత్తన పంపిణీ

డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్‌మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.

Jharkhand: జార్ఖండ్ లో బ్లాక్‌ చెయిన్ టెక్నాలజీ ద్వారా విత్తన పంపిణీ

Jharkhand: డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్, జార్ఖండ్ మరియు గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ కంపెనీ, సెటిల్‌మింట్, సంయుక్తంగా రైతులకు బ్లాక్‌చెయిన్ ఆధారిత విత్తన పంపిణీని విజయవంతంగా ప్రారంభించినట్లు ప్రకటించాయి.

విత్తన పంపిణీని ట్రాక్ చేయడానికి బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించిన దేశంలో మొదటి రాష్ట్రం జార్ఖండ్. బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్ వ్యవసాయ డైరెక్టరేట్ నుండి విత్తన సరఫరా పంపిణీని ట్రాక్ చేస్తుంది, సరఫరా ఆర్డర్‌లను జారీ చేస్తుంది. ప్రభుత్వ విత్తనోత్పత్తి ఏజెన్సీ నుండి పంపిణీదారులు, రిటైలర్లు, చివరకు రైతులకు విత్తన పంపిణీని ట్రాక్ చేస్తుంది. విత్తన మార్పిడి పథకం మరియు ఇతర పథకాల ద్వారా రైతులు స్వీకరించిన విత్తనాల పారదర్శకత మరియు ప్రామాణికతను పెంచడానికి బ్లాక్‌చెయిన్‌ ను అమలు చేస్తారు. మధ్యవర్తులను తొలగిస్తూనే పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

రైతులకు సరైన సమయంలో నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడం, అలాగే మధ్యవర్తులను తొలగించడం, లబ్ధిదారులను గుర్తించడం మరియు రైతుల డేటాబేస్‌ను రూపొందించడం ఈ ప్రభుత్వం యొక్క అత్యధిక ప్రాధాన్యత అని జార్ఖండ్‌లోని వ్యవసాయ డైరెక్టర్ నేషా ఓరాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి: