Last Updated:

PM Modi in Kerala: కేరళలో మొదటి వందే భారత్ రైలు, వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం తిరువనంతపురం మరియు కాసర్‌గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.

PM Modi in Kerala: కేరళలో మొదటి వందే భారత్ రైలు, వాటర్ మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi in Kerala: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ఉదయం తిరువనంతపురం మరియు కాసర్‌గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.

11 జిల్లాలగుండా వందే భారత్ రైలు..(PM Modi in Kerala)

ఈ రైలు 11 జిల్లాలు, తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ మరియు కాసర్‌గోడ్‌లను కవర్ చేస్తుంది. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1 నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించడానికి ముందు, మోదీ రైలులోని ఒక కోచ్‌లో పాఠశాల విద్యార్థులతో సంభాషించారు.అనంతరం కొచ్చిలో దేశంలోనే తొలి వాటర్ మెట్రోను మంగళవారం ప్రారంభించారు.

వాటర్ మెట్రో ఒక విలక్షణమైన పట్టణ రవాణా వ్యవస్థను అందిస్తుంది. ఇది సంప్రదాయ మెట్రో వ్యవస్థలతో పోల్చదగిన స్థాయి సౌలభ్యం మరియు ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ కింద అభివృద్ధి చేసిన ఎనిమిది ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్‌లతో మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుంది. ఈ కలల ప్రాజెక్టుకు కేరళ ప్రభుత్వం మరియు జర్మన్ కంపెనీ KfW నిధులు సమకూరుస్తున్నాయి. ఇందులో 38 టెర్మినల్స్ మరియు 78 ఎలక్ట్రిక్ బోట్లు ఉన్నాయి.

రూ.3,200 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్దాపన..

రూ.3,200 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. కొచ్చి వాటర్ మెట్రోతో పాటు, దిండిగల్-పళని-పాలక్కాడ్ సెక్షన్ రైలు విద్యుద్దీకరణను కూడా ప్రధాని మోదీ అంకితం చేయనున్నారు.ఈ కార్యక్రమంలో, తిరువనంతపురం, కోజికోడ్ మరియు వర్కల శివగిరి రైల్వే స్టేషన్‌ల పునరాభివృద్ధితో సహా పలు రైలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.