Last Updated:

PMGKAY Scheme: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం

పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ పథకం కింద, కేంద్రం 1 జనవరి 2023 నుండి పిఎంజికెఎవై కింద అంత్యోదయ అన్న యోజన (AAY) గృహాలు మరియు ప్రాధాన్యతా గృహాల (PHH) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది.

PMGKAY Scheme: ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ఐదేళ్లపాటు పొడిగించిన కేంద్రం

PMGKAY Scheme: పేదలకు నెలకు 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం మరో ఐదేళ్లపాటు పొడిగించింది. ఈ పథకం కింద, కేంద్రం 1 జనవరి 2023 నుండి పిఎంజికెఎవై కింద అంత్యోదయ అన్న యోజన (AAY) గృహాలు మరియు ప్రాధాన్యతా గృహాల (PHH) లబ్ధిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తోంది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో..(PMGKAY Scheme)

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వ తాజా నిర్ణయం గురించి వివరాలను తెలియజేస్తూ, గత ఐదేళ్లలో దాదాపు 13.50 కోట్ల మంది భారతీయులు పేదరిక స్థాయికి ఎగువకు చేరుకున్నారని చెప్పారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన పెద్ద విజయం. అదేవిధంగా, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రవేశపెట్టబడింది. ఈ పథకాన్ని జనవరి 2024,1వ తేదీ నుండి వచ్చే ఐదేళ్లపాటు పొడిగించాలని నిర్ణయించారని ఠాకూర్ చెప్పారు.వచ్చే ఐదేళ్ల కాలంలో ఈ పథకంపై దాదాపు రూ.11.8 లక్షల కోట్ల వ్యయం అవుతుందని మంత్రి వివరించారు.

గత ఏడాది డిసెంబర్‌లో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)లో పీఎంజీకేఏవైని విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. అదనపు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడానికి 2020లో పిఎంజికెఎవై ప్రారంభించారు. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద, గ్రామీణ జనాభాలో 75 శాతం వరకు మరియు పట్టణ జనాభాలో 50 శాతం మంది రెండు వర్గాల కింద ఉన్నారు.పేదవారిలో అత్యంత పేదలుగా ఉన్న అంత్యోదయ అన్నయోజన కుటుంబాలు ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల ఆహారధాన్యాలకు అర్హులు కాగా, ప్రాధాన్యత కలిగిన కుటుంబాలలో ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోలు అందజేస్తారు.