Last Updated:

Air India pilot: ముగ్గురు ఎంపీలతో సహా 100 మంది ప్రయాణీకులు ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని నడపనన్నపైలట్..ఎందుకో తెలుసా?

ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు ఆదివారం (జూలై 23) గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

Air India pilot: ముగ్గురు ఎంపీలతో సహా 100 మంది ప్రయాణీకులు ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని నడపనన్నపైలట్..ఎందుకో తెలుసా?

Air India pilot: ఢిల్లీకి వెళ్లే ఎయిరిండియా విమానానికి ఊహించని అంతరాయం ఏర్పడటంతో ముగ్గురు బీజేపీ ఎంపీలతో సహా 100 మంది ప్రయాణికులు ఆదివారం (జూలై 23) గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) నిబంధనల ప్రకారం విమాన పైలట్ తన డ్యూటీ సమయం మించి పనిచేసానని పేర్కొంటూ విమానాన్ని నడిపేందుకు నిరాకరించడంతో ఈ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. దీనితో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఎఫ్‌డిటిఎల్ నిబంధనల మేరకు..(Air India pilot)

జూలై 23న రాత్రి 8.30 గంటలకు టేకాఫ్ కావాల్సిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులు ఎక్కిన తర్వాత ఈ ఘటన జరిగింది. రాజ్‌కోట్ ఎంపీ మోహన్ కుందారియా, జామ్‌నగర్ ఎంపీ పూనమ్ మాదం, కొత్తగా ఎన్నికైన రాజ్యసభ ఎంపీ కేసరిదేవ్‌సింగ్ ఝాలా ముగ్గురు రాజకీయ నాయకులు ఉన్నారు.దీనిపై ఎయిర్ ఇండియా జూలై 23 సాయంత్రం రాజ్‌కోట్ మరియు ఢిల్లీ మధ్య నడిచే AI404 ఆపరేషనల్ కారణాల వల్ల ఆలస్యం అయిందని పేర్కొంది., కాక్‌పిట్ సిబ్బంది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్‌డిటిఎల్) నిబంధనల క్రిందకు వచ్చారు, దీని కోసం వారు రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం విమానాన్ని నడపలేరు. ఎఫ్‌డిటిఎల్ నియంత్రణ అనేది చర్చించలేని అంశం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడదని ఎయిర్ ఇండియా ప్రతినిధి చెప్పారు.
అత్యవసర ప్రాతిపదికన ఢిల్లీకి చేరుకోవాల్సిన కొంతమంది ప్రయాణికులకు ప్రత్యుమ్నాయ ఏర్పాట్లు చేసారు. మిగిలిన ప్రయాణికులకు అన్ని భోజనాలతో పాటు హోటల్ వసతిని అందించారు. చార్జీలు వాపసు కోరిన వారికి చేయడం జరిగిందని చెప్పారు.

ఈ నెల ప్రారంభంలో ఇదే విధమైన సంఘటనలో, కొన్ని సాంకేతిక సమస్య కారణంగా జూలై 2న వాంకోవర్ నుండి ఢిల్లీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం AI 186 రద్దు చేయడంతో దాదాపు 20 నుండి 25 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయం (UBC) విద్యార్థులు తమ కష్టాలను వివరిస్తూ, జూలై 2న ఉదయం 10.15 గంటలకు వాంకోవర్ విమానాశ్రయం నుండి విమానం మొదట బయలుదేరాల్సి ఉందని, అయితే రెండుసార్లు రీషెడ్యూల్ చేయబడిందని మరియు చివరికి రద్దు చేయబడిందని పేర్కొన్నారు.