Last Updated:

Tirupati: తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా

Tirupati: తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Tirupati: తిరుపతి టౌన్ బ్యాంక్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. వైసిపి దొంగ ఓట్లు వేయిస్తోందంటూ టీడీపీ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. దీనితో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దొంగ ఓట్లు వేసే వారిని పట్టుకున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదంటూ టీడీపీ నేతలు ఆరోపించారు.

తిరుపతి టౌన్ బ్యాంక్ కు సంబంధించి మొత్తం 57 వేల 2 వందల 50 మంది ఓటర్లు ఉండగా, 12 మంది డైరెక్టర్లను ఓటర్లు ఎన్నుకోనున్నారు. అయితే వైసీపీ, టీడీపీ ప్యానెళ్లు బరిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: