Last Updated:

Papua New Guinea: పపువా న్యూ గినియాలో అల్లర్లు..15 మంది మృతి.. 14 రోజులు ఎమర్జెన్సీ విధింపు

పపువా న్యూ గినియా (PNG) దేశంలో వేతనాల కోసం పోలీసులు సమ్మె చేయడంతో అల్లర్లు చెలరేగాయి. రాజధాని పోర్ట్ మోర్స్బీలోని ఆస్తులపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పంటించారు. పోలీసులు గత ఏడాదిగా పెరుగుతున్న నేరాలతో పోరాడుతున్నారు.  ఈ నేపధ్యంలో తమ  వేతనాల్లో తగ్గింపును గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం సమ్మె ప్రారంభించారు.

Papua New Guinea: పపువా న్యూ గినియాలో అల్లర్లు..15 మంది మృతి.. 14 రోజులు  ఎమర్జెన్సీ విధింపు

Papua New Guinea: పపువా న్యూ గినియా (PNG) దేశంలో వేతనాల కోసం పోలీసులు సమ్మె చేయడంతో అల్లర్లు చెలరేగాయి. రాజధాని పోర్ట్ మోర్స్బీలోని ఆస్తులపై అల్లరిమూకలు దాడి చేసి నిప్పంటించారు. పోలీసులు గత ఏడాదిగా పెరుగుతున్న నేరాలతో పోరాడుతున్నారు.  ఈ నేపధ్యంలో తమ  వేతనాల్లో తగ్గింపును గుర్తించిన పోలీసులు బుధవారం ఉదయం సమ్మె ప్రారంభించారు.

షాపుల లూటీలు, దహనాలు..(Papua New Guinea)

 

ఈ పరిస్దితిని ఆసరాగా తీసుకుని అల్లరిమూకలు చెలరేగాయి.  అల్లర్లలో 15 మంది మరణించారు.రాజధాని పోర్ట్ మోర్స్బీలో జరిగిన అల్లర్లలో ఎనిమిది మంది మరణించగా, లేలో మరో ఏడుగురు మరణించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. AFPTV ఫుటేజీలో రాజధానిలోని దోపిడీదారులు పగులగొట్టిన గాజు కిటికీల ద్వారా దుకాణాల్లోకి ప్రవేశించడం, దొంగిలించబడిన వస్తువులను కార్డ్‌బోర్డ్ పెట్టెలు, షాపింగ్ ట్రాలీలు మరియు ప్లాస్టిక్ బకెట్లలో పెట్టుకుని పోవడం చూపించింది.బుధవారం సాయంత్రం జనాలు దుకాణాలు మరియు భవనాలను తగలబెట్టిన తర్వాత అల్లర్లను ఉపేక్షించబోమని ప్రధాన మంత్రి జేమ్స్ మరాపే అన్నారు.పోలీసులపై కొత్త పన్ను విధించబడలేదని ప్రభుత్వం సోషల్ మీడియాలో సందేశాలను ప్రసారం చేసింది. వేతన కొరతకు కారణమైనపరిపాలనాపరమైన లోపాన్ని పరిష్కరిస్తానని మారాపే హామీ ఇచ్చారు. సోషల్ మీడియాలోని ఫుటేజీలు బుధవారం నగరం మంటల్లో కాలిపోతున్నట్లు చూపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు వారిని బెదిరించారు.పోర్ట్ మోర్స్బీలోని యునైటెడ్ స్టేట్స్ రాయబార కార్యాలయం సిబ్బంది పోలీసులు తిరిగి పనికి వచ్చారని, అయితే ఉద్రిక్తతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ దేశ హైకమిషన్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. పపువా న్యూ గినియా నుండి సహాయం కోసం ఎటువంటి అభ్యర్థనలు రాలేదని అయితే పోలీసింగ్ మరియు భద్రతలో క్రమం తప్పకుండా మద్దతు ఇస్తామన్నారు.

14 రోజుల ఎమర్జెన్సీ..

మరోవైపు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే గురువారం రాజధానిలో 14 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. 1,000 మంది కంటే ఎక్కువ మంది సైనికులు ఎటువంటి పరిస్దితులనయినా నియంత్రించడానికి సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు.