Last Updated:

Vijay Deverakonda: రౌడీ హీరో చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు

లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు.

Vijay Deverakonda: రౌడీ హీరో చేతిలో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు

Tollywood: లైగర్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైన తర్వాత, విజయ్ దేవరకొండ పెద్దగా స్పందించలేదు. అయితే దర్శకుడు పూరీతో ప్రకటించిన జనగణమనను పక్కన పెట్టాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరితో సినిమా కోసం చర్చలు జరుపుతున్నాడు. దీనిపై ఇంకా తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు. స్క్రిప్టు పూర్తి చేసి య సిద్ధంగా ఉంచమని గౌతమ్‌ని కోరాడు.

లైగర్ ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండ డిమాండ్ ఏమీ తగ్గలేదు. బాలీవుడ్‌లోని ప్రముఖ చిత్రనిర్మాతలు ఇద్దరు అతనితో నిరంతరం టచ్‌లో ఉన్నారు. విజయ్ దేవరకొండకు సరైన ప్రాజెక్ట్ దొరికితే తీయాలని వారు భావిస్తున్నారు. కరణ్ జోహార్ ఇటీవల విజయ్ దేవరకొండ మరియు ఒక దర్శకుడి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో అగ్ర నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం విజయ్ దేవరకొండతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతానికి విజయ్ వచ్చే ఏడాది విడుదలయ్యే ఖుషి పై దృష్టి పెట్టాడు. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించి, 2023లో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇందులో సమంత కథానాయిక. సమంత కోలుకుని తిరిగి సెట్‌కి వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి: