Last Updated:

Crime News : కన్నతల్లిని కిరాతకంగా చంపిన కొడుకు.. నాలుక కోసి మరీ.. ఎక్కడంటే ??

కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌

Crime News : కన్నతల్లిని కిరాతకంగా చంపిన కొడుకు.. నాలుక కోసి మరీ.. ఎక్కడంటే ??

Crime News : కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామభద్రపురంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలో వివరాల్లోకి వెళ్తే.. రామభద్రాపురం లోని వసంతల వీధిలో నివసించే రవణమ్మకు శ్రీనివాసరావు అనే కుమారుడు ఉన్నాడు. మద్యానికి బానిసైన అతను నిత్యం తాగుతూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఫుల్ గా తాగొచ్చిన కొడుకును రవణమ్మ తీవ్రంగా మందలించింది. కొద్దిసేపు తల్లీకొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో శ్రీనివాస తన తల్లిపై దారుణంగా దాడి చేసి హతమార్చాడు. చంపిన అనంతరం ఆ తల్లి నాలుక కోసి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు ఆ దుర్మార్గుడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.