Home / ట్రెండింగ్ న్యూస్
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్లో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మృతికి సంబంధించి క్లబ్ యజమాని, డ్రగ్స్ వ్యాపారి సహా మరో ఇద్దరిని గోవా పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. క్లబ్ వాష్రూమ్లో డ్రగ్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ యొక్క స్వభావం ఇంకా ధృవీకరించబడలేదు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే ఈ డ్రగ్ ఏంటన్నది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
బిగ్ బాస్ సీజన్ 6 త్వరలో మన ముందుకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ వచ్చినప్పటి నుంచి ట్రోల్స్ వాళ్ళు పండగ చేసుకుంటున్నారు . బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఉండే విధానం బట్టి సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తారు . బిగ్ బాస్ చూసే అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు .
నటుడు సోనూ సూద్, గత రెండు సంవత్సరాలుగా ప్రాథమిక మరియు విద్యాపరమైన వనరులను ఇవ్వడానికి తన స్వంత స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. 'సూద్ ఛారిటీ ఫౌండేషన్' అని పిలువబడే స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ రోజ్గార్ మరియు ఇలాజ్ ఇండియా వంటి బహుళ పథకాలను కలిగి ఉంది.
ప్రజలు తమ వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన దినంగా జరుపుకోవాలని కలలు కంటారు. దీనికోసం కొందరు విలాసవంతమైన పార్టీలు చేస్తారు. మరికొందరు ఆకర్షణీయమైన దుస్తులను ధరిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
విజయ్ దేవరకొండ అభిమానులు గతంలో నటి అనసూయ భరద్వాజ్తో సోషల్ మీడియాలో చాలాసార్లు గొడవపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కస్టమ్స్ వాడారని అనసూయ బహిరంగంగానే విమర్శించింది. అప్పటి నుండి, నటుడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోగా నటించిన సినిమా " లైగర్ " నేడు రిలీజ్ అయింది . నిజానికి చెప్పాలంటే పూరి జగన్నాధ్ ఈ సినిమాకి ఎన్నడూ లేని విధంగా సీన్స్ కొత్తగా సృష్టించుకుంటు దర్శకత్వం వహించారనే చెప్పుకోవాలి . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు నుంచే లైగర్ సినిమా బృందం ప్రమోషన్స్ బాగా చేశారు.
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో సినిమా తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో 'బాహుబలి' ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతను సినిమా నిర్మాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నాంపల్లి 14వ అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రాజాసింగ్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదాస్పదంకావడంతో రాజాసింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో రాజాసింగ్కు ధర్మాసనం రిమాండ్ విధిస్తూ ఆదేశించింది. అనంతరం రాజాసింగ్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్పై టెర్రరిజం చార్జీ ఫైల్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది .గత శనివారం నాడు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన అధికారులను, జడ్జిలను బెదిరించారని, సైన్యాన్ని తిరుగుబాటు చేయాలని రెచ్చగొట్టారని ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తనను అరెస్టు చేయకుండా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయనను గురువారం వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.