Published On: February 1, 2026 / 10:24 AM IST

UNION BUDGET 2026 LIVE UPDATE: పార్లమెంట్‌లోనే మాట్లాడతా: రాహుల్ గాంధీ

UNION BUDGET 2026 LIVE UPDATE: పార్లమెంట్‌లోనే మాట్లాడతా: రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లోనే మాట్లాడతా: రాహుల్ గాంధీ

February 1, 2026 / 01:44 PM IST

2026–27 కేంద్ర బడ్జెట్, ఎల్ఓపీ హోదా, లోక్‌సభపై తన వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశాలపై తాను పార్లమెంట్‌లోనే మాట్లాడతానని, సభ అందించే వేదికను ఉపయోగించి రేపు తన అభిప్రాయాలు వెల్లడిస్తానని తెలిపారు.

Latest Update

ఈ బడ్జెట్ దేశంలోని 5% మంది ప్రజలకు మాత్రమే

February 1, 2026 / 01:36 PM IST

కేంద్ర బడ్జెట్‌పై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ బడ్జెట్ పేదలు, గ్రామాల్లో నివసించే వారి అవగాహనకు మించినది అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో ఎటువంటి ఉద్యోగాలు లేదా ఉపాధి కల్పించలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ బడ్జెట్ దేశంలోని 5% మంది ప్రజలకు మాత్రమే ఉపయోగకరం అని చెప్పారు.

దేశ సాంస్కృతిక వారసత్వం కోసమే బడ్జెట్

February 1, 2026 / 01:30 PM IST

కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్ స్పందించారు. "నేటి బడ్జెట్‌ను విక్షిత్ భారత్, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినట్లు చెప్పారు. బడ్జెట్ భారతదేశాన్ని బయో-ఫార్మా, వైద్య పర్యాటక కేంద్రంగా స్థాపించడం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పర్యాటక కారిడార్లను ప్రకటించారు. బడ్జెట్ విక్షిత్ భారత్ కోసం ఒక రోడ్ మ్యాప్‌ను ప్రస్తుతం చేస్తుంది.

సుంకం విధించదగిన వస్తువులపై సుంక రేటును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గింపు

February 1, 2026 / 01:23 PM IST

వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ సుంక నిర్మాణాన్ని సరళీకరించేందుకు, అన్ని సుంకం విధించదగిన వస్తువులపై సుంక రేటును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వినియోగదారులకు లాభం చేకూర్చనుంది. దీంతో వ్యక్తిగత వినియోగ దిగుమతులు అందుబాటులోకి వచ్చి భారం తగ్గి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

సీ ఫుడ్స్‌‌పై కీలక నిర్ణయం

February 1, 2026 / 12:38 PM IST

సీ ఫుడ్స్‌ను ఎగుమతి చేయడానికి ఉపయోగించే నిర్దేశిత ఇన్‌పుట్‌ల డ్యూటీ-ఫ్రీ దిగుమతుల పరిమితిని గత సంవత్సరం ఎగుమతి టర్నోవర్‌లో ప్రస్తుత 1% నుంచి 3% ఎఫ్‌ఓబి విలువకు పెంచాలని కేంద్రమంత్రి సీతారామన్ ప్రతిపాదించారు. ప్రస్తుతం ఎగుమతి లేదా ఫుట్‌సింటిక్ ఎగుమతి కోసం అందుబాటులో ఉన్న నిర్దిష్ట ఇన్‌పుట్‌ల డ్యూటీ-రహిత దిగుమతులను అనుమతిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.

విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 5% నుంచి 2%కి తగ్గింపు

February 1, 2026 / 12:32 PM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2026–27లో ప్రత్యక్ష పన్నులపై కీలక ప్రతిపాదనలు చేశారు. నామమాత్రపు రుసుముతో రిటర్న్‌ల సవరణ గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పెంచాలని సూచించారు. ITR-1, ITR-2 వ్యక్తులకు జూలై 31 వరకు, నాన్-ఆడిట్ వ్యాపారాలు, ట్రస్టులకు ఆగస్టు 31 వరకు గడువును నిర్ణయించారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై TCSను 5% నుంచి 2%కి తగ్గించగా, విద్యా, వైద్య రిమిటెన్స్‌లపై TCS 2%గానే కొనసాగనుంది.

అరకు లోయ, పశ్చిమ కనుమలను అభివృద్ధి చేస్తాం: నిర్మలా

February 1, 2026 / 12:25 PM IST

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ & కాశ్మీర్‌లలో పర్యావరణపరంగా స్థిరమైన పర్వత మార్గాలను అభివృద్ధి చేస్తామని ఆమె ప్రతిపాదించారు. తూర్పు కనుమలలోని అరకు లోయ, పశ్చిమ కనుమలలో కూడా అభివృద్ధి చేస్తామన్నారు. ఒడిశా, కర్ణాటక, కేరళలోని కీలక గూడు ప్రదేశాలలో తాబేళ్ల మార్గాలను అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. "విక్షిత్ భారత్‌కు ప్రధాన డ్రైవర్‌గా సేవల రంగంపై దృష్టి సారించే చర్యలను సిఫార్సు చేసేందుకు హై-పవర్‌తో కూడిన ‘ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రైజ్’ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణియించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది 2047 నాటికి 10% గ్లోబల్ షేర్‌తో సేవలలో మమ్మల్ని గ్లోబల్ లీడర్‌గా మారుస్తుందని ఆకాంక్షించారు. AIతో సహా సాంకేతికతలు, ఉద్యోగాలు, నైపుణ్య అవసరాలపై చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రతీ జిల్లా బాలికల హాస్టల్

February 1, 2026 / 12:16 PM IST

దేశంలో ఉన్నత విద్యా రంగంలో పెట్టుబడుల కోసం కొత్త ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్శిటీ టౌన్‌షిప్‌లు, బాలికల హాస్టల్స్, టెలిస్కోప్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తాను బహుళ దశలను ప్రతిపాదిస్తున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో బాలికల వసతిగృహాన్ని నిర్మస్తామని ఆమె ప్రకటించారు. అదేవిధంగా "స్పోర్ట్స్ సెక్టార్ బహుళ ఉపాధి, నైపుణ్యం, ఉద్యోగ అవకాశాలను అందిస్తామన్నారు. ఖేలో ఇండియా కార్యక్రమం ద్వారా చలనంలో ఉన్న క్రీడా ప్రతిభను క్రమబద్ధంగా పెంపొందించడానికి, రాబోయే దశాబ్దంలో క్రీడా రంగాన్ని మార్చేందుకు ఖేలో ఇండియా మిషన్‌ను ప్రారంభించాలని ప్రతిపాదిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఆయుష్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చాం: నిర్మలా

February 1, 2026 / 12:09 PM IST

యూనియన్ బడ్జెట్ 2026-27లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆయుష్ రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. మూడు కొత్త ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆయుష్ ఫార్మసీలు, డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను అప్‌గ్రేడ్ చేసి నైపుణ్యవంతుల్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. జామ్‌నగర్‌లోని WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. అలాగే భారత్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దేందుకు 5 ప్రాంతీయ హబ్‌ల ఏర్పాటుకు రాష్ట్రాలకు మద్దతు పథకం ప్రతిపాదించారు.

7 హై-స్పీడ్ రైల్ కారిడార్‌ల ఏర్పాటు

February 1, 2026 / 12:01 PM IST

పర్యావరణపరంగా స్థిరమైన ప్రయాణీకుల వ్యవస్థలను ప్రోత్సహించడానికిచ కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తమ సర్కార్ నగరాల మధ్య 7 హై-స్పీడ్ రైల్ కారిడార్‌లను అభివృద్ధి కనెక్టర్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. ముంబై నుంచి పూణే, పూణే నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు, ఢిల్లీ నుంచి వారణాసి, వారణాసి నుంచి సిలిగురి వరకు ఈ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌లను ఏర్పాటు చేస్తాం: నిర్మలా

February 1, 2026 / 11:55 AM IST

పర్యావరణహిత కార్గో రవాణా కోసం తూర్పున డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కొత్త ప్రత్యేక ఫ్రైట్ కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో 20 కొత్త జలమార్గాలు, ఒడిశాలో ఐదు జాతీయ జలమార్గాలతో ప్రారంభమవుతాయన్నారు. పారిశ్రామిక కేంద్రాల అనుసంధానం, పారాదీప్–దామ్రా ఓడరేవుల ద్వారా వారణాసి, పాట్నాకు అంతర్గత జలమార్గాలు, ఓడ మరమ్మత్తు వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

భూమి కారిడార్‌ల ఏర్పాటుకు కేంద్రం మద్దతు

February 1, 2026 / 11:48 AM IST

కేంద్ర బడ్జెట్ 2026–27లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల కోసం 2025లో ప్రారంభించిన పథకాన్ని ప్రస్తావించారు. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో ప్రత్యేక అరుదైన-భూమి కారిడార్‌ల ఏర్పాటుకు కేంద్రం మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

బయో ఫార్మా శక్తికి రాబోయే ఐదేళ్లలో రూ. 10,000 కోట్లు

February 1, 2026 / 11:43 AM IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27లో వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి బయో ఫార్మా శక్తిని రాబోయే ఐదేళ్లలో రూ. 10,000 కోట్లతో ప్రతిపాదించారు. సాంకేతిక రంగంలో ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ని ప్రారంభించి పరిశ్రమ-ఆధారిత పరిశోధనలపై దృష్టి సారిస్తుందని ఆమె తెలిపారు. దేశీయ తయారీ సామర్థ్యం, ​​ఇంధన భద్రత, కీలకమైన దిగుమతి డిపెండెన్సీలను ప్రభుత్వం తగ్గించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేంద్ర బడ్జెట్ 2026కి ఆమోదం తెలిపిన తర్వాత నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని చేస్తున్నారు. ప్రత్యేక బడ్జెట్ సెషన్ కోసం వారాంతంలో ట్రేడింగ్ జరగడం భారతీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. అంతకుముందు, 1999లో ఒక వారాంతంలో, ఫిబ్రవరి 27న అంటే శనివారం కేంద్ర బడ్జెట్‌ను సమర్పించినప్పుడు మార్కెట్లు తెరుచుకున్నాయి.

ఆరు రంగాల్లో జోక్యాలు ప్రతిపాదించాం

February 1, 2026 / 11:35 AM IST

కేంద్ర బడ్జెట్ 2026–27ను ప్రవేశపెడుతూ.. మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసి స్థిరంగా ఉంచేందుకు ఆరు రంగాల్లో జోక్యాలు ప్రతిపాదించారు. 7 వ్యూహాత్మక రంగాల్లో తయారీ బలోపేతం, వారసత్వ పరిశ్రమల పునరుజ్జీవనం, ఛాంపియన్ MSMEల సృష్టి, దీర్ఘకాల భద్రత ప్రోత్సాహం, నగర ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి ఇందులో ఉన్నాయని ఆమె వెల్లడించారు.

ఇంధన భద్రత పెంచి దిగుమతుల ఆధారాన్ని తగ్గించాం: సీతారామన్

February 1, 2026 / 11:29 AM IST

ఆత్మనిర్భర్త లక్ష్యంగా ప్రభుత్వం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం, ఇంధన భద్రత పెంచి దిగుమతుల ఆధారాన్ని తగ్గించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యవసాయం, గృహ కొనుగోలు వంటి సేవలకు మద్దతుతో పౌరులు లాభపడ్డారని ఆమె వెల్లడించారు. ఫలితంగా 7 శాతం వృద్ధి, పేదరికం తగ్గింపు, ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మెరుగుదల సాధ్యమైంది. ఈ చర్యలు సమగ్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడి దేశవ్యాప్తంగా అవకాశాలు సృష్టించి స్థిరమైన వృద్ధిని ప్రోత్సహించాయన్నారు.

సుదూర నిర్మాణాత్మక సంస్కరణలను అనుసరించాం: నిర్మలా

February 1, 2026 / 11:23 AM IST

తమ ప్రభుత్వం సుదూర నిర్మాణాత్మక సంస్కరణలను అనుసరించామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక వివేకం, ద్రవ్య స్థిరత్వం, ప్రభుత్వ పెట్టుబడులపై బలమైన ఒత్తిడిని కొనసాగిస్తూ.. ముందుకెళ్తున్నాం. దేశీయ మాన్యుఫ్‌పై ఆధారపడే సామర్థ్యాన్ని తగ్గించామని పేర్కొన్నారు.

నియంత్రిత ద్రవ్యోల్బణాన్ని సాధించాం: నిర్మలా

February 1, 2026 / 11:13 AM IST

గత 12 ఏళ్లుగా ప్రభుత్వం స్థిరత్వం, ఆర్థిక క్రమశిక్షణ, స్థిరమైన వృద్ధి, నియంత్రిత ద్రవ్యోల్బణాన్ని సాధించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అనిశ్చిత కాలాల్లో తీసుకున్న జాగ్రత్త నిర్ణయాలు, సంస్కరణలు, అంతరాయాల సమర్థ నిర్వహణ దేశ ఆర్థిక పథాన్ని బలపరిచాయని పేర్కొన్నారు.

ప్రజల సంక్షేమం కోసమే ఈ బడ్జెట్: ఎంపీ బైజయంత్ పాండా

February 1, 2026 / 11:08 AM IST

2026-27 కేంద్ర బడ్జెట్‌పై బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా స్పందించారు. గత పదకొండు ఏళ్లుగా ప్రతిపక్షాలు ఒకటే విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం ప్రపంచంలోనే అత్యల్పమని, ఆర్థిక వ్యవస్థ 4వ స్థానంలో ఉందని చెప్పారు. ఇది వేగంగా అభివృద్ధి చెందుతోందని, బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్‌ను అభినందించారు. దేశీయ విధానాల ఫలితంగా పెట్టుబడులు పెరిగాయని, వృద్ధి స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ఈ బడ్జెట్ తోడ్పడుతుందని వెల్లడించారు.

విక్షిత్ నగరాల కోసమే

February 1, 2026 / 11:01 AM IST

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కెపి మౌర్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ విక్షిత్ భారత్, విక్షిత్ ఉత్తరప్రదేశ్, విక్షిత్ గ్రామాలు, విక్షిత్ నగరాల కోసమని తెలియజేశారు. మేమంతా కేంద్ర బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నామని ఆయన వెల్లడించారు.

సమస్యలు పరిష్కారం కాలేదు..

February 1, 2026 / 10:44 AM IST

భారత ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా నిర్మాణాత్మక సమస్యలు పరిష్కారం కాలేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తీవారి వ్యాఖ్యనించారు. ప్రైవేట్ పెట్టుబడులు వేగం పొందలేదు, వృద్ధి మందగించింది, ఉపాధి సృష్టి బలహీనంగా ఉంది ప్రభుత్వం విధానాలు మార్పులు అవసరం అని స్పష్టం చేశారు

బడ్జెట్‌పై పెద్దగా అంచనాలు లేవు

February 1, 2026 / 10:38 AM IST

కాంగ్రెస్ అగ్ర నేత, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా బడ్జెట్ సమావేశానికి చేరుకున్నారు. ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బడ్జెట్‌పై తనకు పెద్దగా అంచనాలు లేవు అని ఆమె వెల్లడించారు.

గజేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు

February 1, 2026 / 10:21 AM IST

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సర్కార్‌పై విశ్వాసం కలిగి ఉండాలని సూచించారు. గత 11 సంవత్సరాలుగా ప్రభుత్వం కృషి చేస్తున్న లక్ష్యం, ఈ విక్షిత్ భారత్‌గా‌ చెప్పారు. 2014 నుంచి అన్ని బడ్జెట్‌లు ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ బడ్జెట్ కూడా భారతదేశాన్ని విక్షిత భారత్‌గా మార్చే దిశగా మరో అడుగు అవుతుందని పేర్కొన్నారు.

FOLLOW US
FacebookInstagramYouTubeTwitter