South Central Railway Special Trains: ప్రయాణికులకు గుడ్న్యూస్.. 44 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
South Central Railway announced Special Trains: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 స్పెల్ రైళ్లను పట్టాలెక్కించినట్లు వివరించింది. విశాఖ-బెంగళూరు (08581) మధ్య జూన్ 1వ తుదీ నుంచి 29 వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. బెంగళూరు-విశాఖ (08582) మధ్య జూన్ 2వ తేదీ నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని తెలిపింది.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి..
విశాఖపట్నం-తిరుపతి (08547) రైలు జూన్ 4వ తేదీ నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని తెలిపింది. విశాఖ-తిరుపతి (08548) రైలు జూన్ 5వ తేదీ నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం నడుస్తుందని పేర్కొంది. విశాఖపట్నం-చర్లపల్లి (08579) రైలు జూన్ 6వ తేదీ నుంచి జులై 27 వరకు ప్రతి శుక్రవారం చర్లపల్లి నుంచి-విశాఖ (08580) మధ్య రైలు జూన్ 7వ తేదీ నుంచి జులై 26 వరకు ప్రతి శనివారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ప్రయాణికులు ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.