Last Updated:

Kedarnath Temple: ఏప్రిల్ 25 నుంచి తెరచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం

ప్రసిద్ద పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఏప్రిల్ 25న తెరవబడుతుందని అధికారులు బుధవారం తెలిపారు.ఏప్రిల్ 25న యాత్ర ప్రారంభం కానుంది.భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

Kedarnath Temple: ఏప్రిల్ 25 నుంచి  తెరచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం

Kedarnath Temple: ప్రసిద్ద పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఏప్రిల్ 25న తెరవబడుతుందని అధికారులు బుధవారం తెలిపారు.ఏప్రిల్ 25న యాత్ర ప్రారంభం కానుంది.భక్తులు నడకతో పాటు హెలికాప్టర్‌లో కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.

చార్ ధామ్ యాత్రకు 6.34 లక్షల మంది భక్తులు ..(Kedarnath Temple)

రాష్ట్ర పర్యాటక శాఖ ప్రకారం, కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణించే యాత్రికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్ బుకింగ్ కోసం అధికారం పొందింది.రాబోయే చార్‌ధామ్ యాత్రను దృష్టిలో ఉంచుకుని, మొత్తం 6.34 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారని ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్‌మెంట్ కౌన్సిల్ మార్చిలో తెలిపింది.ఇప్పటి వరకు, 6.34 లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్ర కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో కేదార్‌నాథ్ ధామ్‌కు 2.41 లక్షలు మరియు బద్రీనాథ్ ధామ్‌కు 2.01 లక్షలు, యమనోత్రికి 95,107 మరియు గంగోత్రి ధామ్‌కు 96,449 మంది భక్తులు నమోదు చేసుకున్నారు.

యాత్రికులకోసం హెల్త్ ఏటీఎం ..

చార్‌ధామ్ యాత్రలో ఆరోగ్య పరీక్షల కోసం హెల్త్ ఏటీఎం ఏర్పాటు చేస్తామని, ఈ సౌకర్యంతో భక్తులకు చాలా సౌకర్యాలు లభిస్తాయని ఉత్తరాఖండ్ సీఎం ధామి తెలిపారు.చార్ ధామ్ యాత్రలో వైద్య సౌకర్యాల పటిష్టతకు ఇది మంచి ముందడుగని ఆయన అన్నారు.మార్చి 11న రుద్రప్రయాగ్ జిల్లా యంత్రాంగం ఏప్రిల్ 22న ప్రారంభం కానున్న చార్ ధామ్ యాత్రకు సన్నాహాలు ప్రారంభించింది.ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్ర భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఈ తీర్థయాత్ర నాలుగు పవిత్ర స్థలాలు బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి తో కూడి ఉంటుంది.

ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ పుణ్యక్షేత్రాలు ప్రతి సంవత్సరం దాదాపు ఆరు నెలల పాటు మూసివేయబడతాయి. వేసవిలో (ఏప్రిల్ లేదా మే) తెరవబడతాయి. శీతాకాలం (అక్టోబర్ లేదా నవంబర్) ప్రారంభంతో మూసివేయబడతాయి.ఏప్రిల్ 22న యమునోత్రి, గంగోత్రి ఆలయాలను తెరవడంతో చార్ ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్, ఏప్రిల్ 27న బద్రీనాథ్ తెరుచుకోనున్నాయి.