Home / videos
బన్సీలాల్పేటలోని చారిత్రక మెట్ల బావి పూర్వవైభవం సంతరించుకుంటోంది. 17వ శతాబ్దం నాటి కట్టడం పునరుద్ధరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. చెత్తా చెదారంతో నిండిన బావిని శుభ్రపర్చడంతోపాటు సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేశారు.
"సైకో పోవాలి సైకిల్ రావాలని" రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని టీడీపీ నేత పట్టాభి అన్నారు. యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు స్థాపించిన స్కిల్ డెవల్పెమెంట్ సెంటర్స్ విషయంలో స్కాం జరిగిందంటూ ఈడీ ఎంక్వైరీ చేపట్టడం ఏంటంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పర్యటనపై రాష్ట్రంలో కొనసాగుతున్న ఆంక్షలపై జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ ప్రజలను కలుసుకోకుండా ఎందుకు రాష్ట్రప్రభుత్వ నేతలు ఇంతగా ఆంక్షలు పెడుతున్నారు అనేది పలువురి ప్రశ్న. మరి దీనిపై ఈ ప్రత్యేక కథనం చూసేద్దామా..
దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.
హైదరాబాద్లో నిర్వహించిన వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాల నుంచి ఆయన వాణిజ్య శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు.
జగనన్న కాలనీ పేరుతో వైసీపీ మోసాలకు పాల్పడుతోందని జనసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో పేదలకు కేటాయించిన హౌసింగ్ లేయవుట్లలో చాలా అక్రమాలు జరిగాయంటూ జనసైనికులు మండిపడ్డారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త విని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిత్రసీమలో సూపర్స్టార్ బిరుదుకు సార్థకత చేకూర్చారన్నారని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. కృష్ణ పార్ధివ దేహానికి నివాళులర్పించారు పవన్ కళ్యాణ్. మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పవన్ చూసిన మహేష్ కాస్త ధైర్యం లభించినట్టు అయ్యింది.
కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.
స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
కృష్ణ వ్రింద విహారి సినిమాలో నాగశౌర్యకు జోడిగా నటింటి మెప్పించిన కథానాయిక షెర్లీ సెటియా. ముద్దుముద్దు మాటలతోనే కాకుండా తన అందమైన గాత్రంతో ఏముందిరా పాటను ఆలపించి ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. మరి షెర్లీ చెప్పిన కబుర్లను చూసేద్దామా..