Home / Sports News
బ్రిటన్లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ హవా కొనసాగుతోంది. తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి సంచలనం సృష్టించింది. ఇటీవల మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచి భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేసిన నిఖత్ జరీన్ కామన్వెల్త్ క్రీడల్లోనూ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.
కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా, మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ మహిళా క్రికెట్ కీలక మ్యాచ్లో టీమ్ఇండియా అదరగొట్టింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో బార్బడోస్ను చిత్తుగా ఓడించి గ్రూప్-A నుంచి సెమీస్కు దూసుకెళ్లింది. బ్యాటింగ్లో రోడ్రిగ్స్ 56 పరుగులతో నాటౌట్, బౌలింగ్లో రేణుకా సింగ్ 4 వికెట్లతో విజృంభించిన వేళ భారత్ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.
టీ20 సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా తొలి వన్డేలోనూ దుమ్ము రేపింది. భారత బౌలర్లు బుల్లెట్ బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ భరతం పట్టారు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్తో చెలరేగాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఇంగ్లండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. మొహ్మద్ షమీ మూడు వికెట్లతో చెలరేగడంతో, తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
సెర్బియాకు చెందిన జకోవిచ్ 2022 వింబుల్డన్ విజేతగా నిలిచాడు. టోర్ని మొత్తం సవాళ్లను ఎదుర్కొన్న జకోవిచ్.. ఫైనల్ లో నిక్ కిరియోస్ ను చిత్తు చేసి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో కెరియర్ లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
టీ20 సిరీస్ గెలుపుతో ఉత్సహాంగా ఉన్న టీమిండియా వన్డే సిరీస్ కు సిద్దమవుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ సాయంత్రం లండన్ లోని ఓవల్ మైదానంలో తొలి వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ను కూడా గెలుచుకుని టూర్ ను విజయవంతంగా ముగించాలని టీమిండియా భావిస్తోంది.
చివరి టీ20లో ఓడిపోయిన టీమిండియాభారత్ , ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన చివరి టీ20లో టీమిండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 216 పరుగుల భారీ టార్గెట్ కు 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ చేసినా మిగతా వారి నుంచి ఎలాంటి సహకారం అందకపోవడంతో పరాజయం తప్ప లేదు.
కజకిస్థాన్ కు చెందిన ఎలీనా రైబాకినా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ ను కైవసం చేసుకుంది. ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి కాగా, అద్భుతమైన ఆటతీరుతో ట్యునీషియాకు చెందిన ఆన్స్ జాబెర్ ను ఓడించింది.
రెండో టీ20లోనూ భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్ భారత్ కైవసం అయ్యింది. బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 49 పరుగులతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్. ముందుగా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.