Published On:

Balkampet: కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

Balkampet: కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం

Yellamma Kalyanam: హైదరాబాద్ లో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నేడు వైభవంగా జరిగింది. ఉదయం 11.51 గంటలకు అభిజిత్ లగ్నంలో జమదగ్ని మహర్షితో అమ్మవారి వివాహం పూర్తిచేశారు. అమ్మవారి కల్యాణం నేపథ్యంలో ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఎల్లమ్మ కల్యాణానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కల్యాణానికి హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి కల్యాణం చూసి ఆనందం పరవశం పొందారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

 

మరోవైపు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, రథోత్సవం నేపథ్యంలో రేపటి వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. గ్రీన్ ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వైపు వెళ్లే వాహనాలను ఎస్ఆర్ నగర్ టీ- జంక్షన్ నుంచి మళ్లించి.. ఎస్ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బీకేగూడ క్రాస్ రోడ్డు, శ్రీరామ్ నగర్, సనత్ నగర్ మీదుగా ఫతేనగర్ వైపు అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి: