Home / Bangladesh
PM Modi meets Bangladesh Interim Chief Adviser Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. థాయిల్యాండ్లోని బ్యాంగ్కాక్లో జరుగుతున్న బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. గత ఆగస్టులో బంగ్లా సర్కారులో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. ఓవైపు బీజింగ్-ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి […]
Bangladesh Cricketer Tamim Iqbal admitted to hospital in critical condition: బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యారు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ ఆడుతుండగా మైదానంలోనే ఒక్కసారిగా ఇక్బాల్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే తోటి క్రీడాకారులతో పాటు సిబ్బంది అప్రమత్తమై ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఇక్బాల్కు ఈసీజీతో పాటు ఇతర స్కాన్నింగ్స్ చేయించారు. ప్రస్తుతం ఇక్బాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఇక్బాల్ […]
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్.. 49.2 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమయ్యారు. ఆరంభంలో తొలి రెండు ఓవర్లకు కేవలం 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లో ఓపెనర్ […]
India opt to bowl against defending champions Bangladesh: దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తుదిసమయం ప్రారంభమైంది. ఫైనల్ మ్యాచ్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. ఇందులో భాగంగా టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గత ఆసియా కప్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు సెమిస్లో తలపడగా.. భారత్ ఓటమి చెంది ఇంటిబాట పట్టింది. అయితే ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ గెలవగా.. డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ ఆసియా […]
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలలో అవామీ లీగ్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రధాని షేక్ హసీనా రికార్డు స్థాయిలో వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) మరియు దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి.
బంగ్లాదేశ్లోని ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ), శుక్రవారం నలుగురి ప్రాణాలను బలిగొన్న ప్యాసింజర్ రైలులో జరిగిన అగ్నిప్రమాదంపై యునైటెడ్ నేషన్స్ పర్యవేక్షణలో దర్యాప్తును డిమాండ్ చేసింది. పార్టీ సీనియర్ జాయింట్ సెక్రటరీ రుహుల్ కబీర్ రిజ్వీ దీనిని మానవత్వంపై క్రూరమైన దౌర్జన్యం గా అభివర్ణించారు.
బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్కు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ఆరోపణలపై కోర్టు సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అతని మద్దతుదారులు దీనిని రాజకీయ ప్రేరేపితమని అభివర్ణించారు.
బంగ్లాదేశ్లోని వేలాది మంది గార్మెంట్ కార్మికులు సోమవారం కనీస వేతనాలను మూడు రెట్లు పెంచాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. ఈ నిరసనలు ఫ్యాక్టరీల ధ్వంసానికి దారితీయడంతో పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ను ప్రయోగించి చెదరగొట్టారు,
బంగ్లాదేశ్లోని ఈశాన్య కిషోర్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొనడంతో సోమవారం 20 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.రాజధాని ఢాకాకు 60 కిలోమీటర్ల దూరంలోని కిషోర్గంజ్ జిల్లాలోని భైరబ్ ప్రాంతంలో మధ్యాహ్నం 3.30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఢాకా వెళ్లే ఎగరోసిందూర్ గోధూలీ ఎక్స్ప్రెస్ వెనుక కోచ్లను ఛటోగ్రాం వైపు వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
బంగ్లాదేశ్లో డెంగ్యూ వేగంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కేసులు నమోదవగా ఈ ఏడాది జనవరి నుండి కనీసం 1,017 మంది మరణించారు.ఈ మహమ్మారి కారణంగా మరణించిన వారిలో 100 మందికి పైగా చిన్నారులు కూడా ఉన్నారు. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులు క్యూ కడుతున్నారు.