Droupadi Murmu: శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పారు: రాష్ట్రపతి

President of India Draupadi Murmu: భారత్కు చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లారు. దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి భారత వ్యోమగామిగా చరిత్రలో సృష్టించారు. మిషన్కు శుక్లా గ్రూప్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. ప్రయోగం విజయంపై తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు.
ఫాల్కన్ 9 రాకెట్లో భారతదేశం నుంచి గ్రూప్ కెప్టెన్గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పారని రాష్ట్రపతి కొనియాడారు. వారి ప్రయాణంపై దేశం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. మీరు, యాక్సియం-4 మిషన్లోని ఇతర దేశాల వ్యోమగాములు కలిసి ప్రపంచమంతా ఒకే కుటుంబమని నిరూపించారని ప్రశంసించారు. నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే మిషన్ సక్సెస్ కావాలని ఆమె ఆకాంక్షించారు. వ్యోమగాములు చేసే ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను మోసుకెళ్లారు : ప్రధాని
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లారు. దాంతో దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఈ మిషన్కు శుక్లా గ్రూప్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. దీనిపై తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. భారత్, హంగెరీ, పోలాండ్, యూఎస్ వ్యోమగాములతో కూడిన స్పేస్ మిషన్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలిపపారు. భారత వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి భారతీయుడిగా చరిత్రలో నిలిచారని తెలిపారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను మోసుకెళ్లారని కొనియాడారు.
ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు భారత కాలమానం ప్రకారం చేపట్టిన ప్రయోగం సక్కెస్ అయ్యింది. ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ఫుల్గా అంతరిక్షంలోకి వెళ్లింది. కొన్ని నిమిషాల తర్వాత వారు ప్రయాణిస్తున్న వ్యోమనౌక రాకెట్ నుంచి విడిపోయి భూకక్ష్యలోకి ప్రవేశించింది. గురువారం సాయంత్రం 4:30 గంటలకు వ్యోమనౌక ఐఎస్ఎస్తో అనుసంధానం కానుంది. ఐఎస్ఎస్లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు ముచ్చటించనుననారు.