Last Updated:

Tripura: త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్.. ఇప్పటివరకు 32.06% పోలింగ్ నమోదు.

ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.

Tripura: త్రిపురలో కొనసాగుతున్న పోలింగ్.. ఇప్పటివరకు 32.06% పోలింగ్ నమోదు.

Tripura: ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. త్రిపురలో ఉదయం 11 గంటల వరకు 32.06% పోలింగ్ నమోదైంది.

దీనికి సంబంధించి జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం ఇలా ఉంది.

ధలై – 33.92%
గోమతి – 30.57%
ఖోవై – 30.88%
ఉత్తర త్రిపుర- 29.48%
సెపాహిజాలా- 31.72%
దక్షిణ త్రిపుర- 33.61%
ఉనకోటి-31.85%
పశ్చిమ త్రిపుర లో 33.18% పోలింగ్ నమోదయింది.

 

కక్రాబన్ పట్టణంలో  హింసాత్మక సంఘటనలు.. (Tripura)

దక్షిణ త్రిపురలోని కక్రాబన్ పట్టణంలో పోలింగ్ సందర్బంగా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడి చేసారని ఇద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని లెఫ్ట్ నాయకులు పేర్కొన్నారు.త్రిపురలో పునరావాసం పొందిన మిజోరాంకు చెందిన బ్రూ వలసదారులు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిని బ్రూస్, రియాంగ్స్ అని కూడా పిలుస్తారు.ఇది ఈశాన్య భారతదేశానికి చెందిన ఒక గిరిజన సంఘం. ఈ తెగ మిజోరం, త్రిపుర మరియు అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో నివసించింది.

ఓటు వేసిన మాజీ సీఎంలు..(Tripura)

బీజేపీ ఎంపీ బిప్లబ్ దేబ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.మేము ఏ ఎన్నికలను పెద్దవి లేదా చిన్నవిగా చూడము. ప్రజలే అంతిమనిర్ణేతలు. వారి తీర్పును గౌరవించాలి. వారు 2018లో మాకు అధికారం ఇచ్చారు.కోవిడ్ ఉన్నప్పటికీ, మేము రాష్ట్రంలోని అన్ని రంగాలను అభివృద్దిచేసాము ఇది ప్రజలకు తెలుసని అన్నారు. అదేవిధంగా త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇవి కూడా చదవండి: