Last Updated:

New Parliament: కొత్త పార్లమెంట్ పై స్టార్స్ ట్వీట్స్.. ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు.

New Parliament: కొత్త పార్లమెంట్ పై స్టార్స్ ట్వీట్స్.. ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్

New Parliament: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్వీకర్ ఓంబిర్లాతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, ఎంపీలు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టార్స్ శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు చేశారు. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ లు ట్వీట్స్ చేయగా.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

ప్రధాని మోదీ శనివారం పార్లమెంట్‌కు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్ లో పంచుకున్నారు. ఆ వీడియోలో కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఉంది. ఈ వీడియోపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. ఈ వీడియోకు వాయిస్‌ ఓవర్స్ జత చేసి ట్వీట్స్ చేయాలని ప్రధాని కోరారు. వచ్చిన ట్వీట్స్ లో కొన్ని వీడియోలను రీట్వీట్‌ చేస్తానని ప్రధాని చెప్పారు. అదే విధంగా ఈ వీడియోలకు హ్యాష్‌ట్యాగ్‌ యాడ్ చేయాలని సూచించారు.

Image

Image

షారూఖ్ గొంతుతో వీడియో

ప్రధాని ట్వీట్ కు హోం మంత్రి అమిత్‌షా, మంత్రులు పీయూష్‌ గోయల్‌, నిర్మలా సీతారామన్‌, హర్‌దీప్‌సింగ్‌ పూరి, కిరణ్‌ రిజుజు, ఎంపీ గౌతమ్‌ గంభీర్‌, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సహా పలువురు సెలబ్రిటీలు వీడియోలను పోస్టు చేశారు. బాలీవుడ్‌ కింగ్‌ఖాన్‌ గొంతు అందించిన వీడియోను ప్రధాని మోదీ రీ ట్వీట్‌ చేశారు. ‘అద్భుతంగా వివరించారు. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రజాస్వామ్య బలానికి, ప్రగతికి ప్రతీక. సంప్రదాయ, ఆధునికతల మేళవింపు’ అని పేర్కొన్నారు.

ఈ వీడియోలో ‘కొత్త పార్లమెంట్‌ భవనం. మన ఆశల కొత్త ఇల్లు. 140 కోట్ల మందిని ఓ కుటుంబంగా ఉంచిన రాజ్యాంగాన్ని సమర్థించేవారి కొత్త ఇల్లు. గ్రామాలు, పట్టణాలతో పాటు దేశం మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ ఈ కొత్త పార్లమెంట్‌లో తగిన స్థానం ఉంటుంది. ఈ కొత్త ఇంటి బాహువులు ఎంత విశాలమైనవి అంటే దేశంలోని ప్రతి జాతిని, ధర్మాన్ని ప్రేమించేంత. ఈ భవనం చూపులు ఎంత తీక్షణమైనవంటే.. దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిని చూడగలవు. వారి సమస్యలను గుర్తించ గలవు. ఇక్కడ సత్యమేవ జయతే అనే నినాదం స్లోగన్‌ కాదు.. విశ్వాసం..’అంటూ షారుక్‌ గొంతుతో సాగిపోయే ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను కొన్ని గంటల్లోనే 57 లక్షల మంది వీక్షించారు.

 

 

బ్రాండ్‌ న్యూ, గ్రాండ్‌ న్యూ భవనం: అక్షయ్ కుమార్

అదే విధంగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేసిన వీడియోను కూడా ప్రధాని రీట్వీట్‌ చేశారు. ‘కొత్త పార్లమెంట్‌ భవనం మన ప్రజాస్వామ్యానికి నిజంగా ఓ వెలుగు. ఇది దేశ సంపన్న వారసత్వాన్ని, భవిత కోసం ఉన్న బలమైన ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది’అని ప్రధాని క్యాప్షన్‌ యాడ్ చేశారు. ఇక ఈ వీడియలో ‘నా తల్లిదండ్రులతో ఇండియాగేట్‌ను సందర్శించిన సమయంలో చుట్టుపక్కల చాలా వరకు బ్రిటిషర్లు నిర్మించిన భవనాలే కనిపించాయి. కానీ, బ్రాండ్‌ న్యూ, గ్రాండ్‌ న్యూ భవనాన్ని చూసి నా హృదయం గర్వంతో ఉప్పొంగింది. భారత పార్లమెంట్‌ ప్రజాస్వామ్య దేవాలయం. ఇది సరికొత్త భారత్‌ గుర్తు’అని వీడియో కొనసాగింది. ఇక, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తమిళంలో ట్వీట్‌ చేయగా.. ప్రధాని మోదీ కూడా తమిళంలోనే ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్‌ ఓం బిర్లా, రచయిత మనోజ్‌ శుక్లా, యూట్యూబర్ అజీత్‌ భారతీ, సినీనటుడు అనుపమ్‌ ఖేర్‌ లాంటి వీడియోలను కూడా ప్రధాని రీట్వీట్‌ చేశారు.

 

 

Image