Last Updated:

Vaccination not a must: భారత్ వచ్చే విదేశీప్రయాణీకులు వ్యాక్సినేషన్ డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు..

ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది.

Vaccination not a must: భారత్ వచ్చే విదేశీప్రయాణీకులు వ్యాక్సినేషన్  డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు..

Covid-19: ఇప్పటివరకు విదేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్‌లో ఓ ఆన్ లైన్ ఫాం నింపాల్సి వచ్చేది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరంలేదు. ఈ ఆంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది.

కొవిడ్ సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగానూ, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించి, కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసు విడుదలైంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది. అయితే.. కరోనా కేసులు ఎక్కువైతే ఈ నిబంధన మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: