Last Updated:

అస్సాం: ఎన్‌ఆర్‌సి అప్‌డేట్ ప్రక్రియలో నిధులు గోల్ మాల్.. కాగ్ రిపోర్టు ఏం చెప్పిందంటే..?

శనివారం అస్సాం లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) అప్‌డేట్ ప్రక్రియలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక తెలిపింది.

అస్సాం: ఎన్‌ఆర్‌సి అప్‌డేట్ ప్రక్రియలో నిధులు గోల్ మాల్.. కాగ్ రిపోర్టు ఏం చెప్పిందంటే..?

Assam: అస్సాం లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) అప్‌డేట్ ప్రక్రియలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ ( కాగ్) నివేదిక తెలిపింది. అస్సాం శాసనసభలో సమర్పించబడిన కాగ్ నివేదిక దీనికి సంబంధించి పలు అవకతవకలను వెలుగులోకి తెచ్చింది.

కాగ్ నివేదికలో ముఖ్యాంశాలు ఇవే..

  • ఆపరేటర్ల వేతనాలపై రూ.155.83 కోట్ల అధిక లాభాన్ని ఆర్జించడం
  • థర్డ్-పార్టీ మానిటరింగ్ కన్సల్టెంట్‌ల మూల్యాంకనం కోసం రూ.10.20 కోట్ల అనధికార వ్యయం
  • ప్రాసెస్ మేనేజ్‌మెంట్ ఖర్చుల కోసం రూ. 1.78 కోట్ల అదనపు వ్యయం
  • 128 అదనపు జనరేషన్ సెట్‌లకు సంబంధించి తాత్కాలికంగా రూ.1.20 కోట్ల దుర్వినియోగం
  • సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మార్పు నివేదికలో రూ.7.10 కోట్ల మేర దుర్వినియోగం

ఆపరేటర్లకు కనీస వేతనం కంటే తక్కువ చెల్లించినందుకు సిస్టమ్ ఇంటిగ్రేటర్, విప్రో లిమిటెడ్‌పై శిక్షార్హమైన చర్యలను కాగ్ సిఫార్సు చేసింది. ఆగస్టు 2019లో ప్రచురించబడిన అస్సాంలో తుది ఎన్‌ఆర్‌సి జాబితాలో 31.1 మిలియన్లకు పైగా ప్రజలు చేర్చడానికి అర్హులుగా గుర్తించారు. కానీ అది 1.9 మిలియన్ల మందిని అనర్హులుగా పేర్కొనడం వివాదానికి దారితీసింది.

ఇవి కూడా చదవండి: