Last Updated:

Preeti Suicide Attempt: పీజీ వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు

Preeti Suicide Attempt: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది.

Preeti Suicide Attempt: పీజీ వైద్య విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన విషయాలు

Preeti Suicide Attempt: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆత్మహత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పీజీ వైద్య విద్యార్ధిని పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని అత్మహత్యాయత్నం చేసింది. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్ధిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ఆత్మాహత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నిజనిజాలు తెలుస్తున్నాయి. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనకు వరంగల్‌ ఏసీపీ కిషన్‌ నిర్లక్ష్యం ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.

వేధింపులకు గురిచేసిన వైద్య విద్యార్ధి అరెస్ట్..

ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వైద్య విద్యార్థులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి.

ఈ వేధింపుల గురించి.. సీనియర్‌ విద్యార్థి సైఫ్ పై పోలీసులకు ముందే ఫిర్యాదు చేసిన.. వారు పట్టించుకోలేదని తెలుస్తోంది. కొద్దీ రోజులుగా సైఫ్‌ ఆమెను వేధిస్తున్నాడు.

ఇదే విషయాన్ని బాధిత విద్యార్ధి తన తండ్రి దృష్టికి తీసుకెళ్లింది. తండ్రి పోలీసు విభాగంలో పనిచేయడంతో.. భద్రతా లభిస్తుందని ప్రీతి ఎదురుచూసింది.

ఇదే విషయాన్ని ఏసీపీ బోనాల కిషన్‌కు ప్రీతి తండ్రి ఫోన్ చేసి వివరాలు చెప్పిన పట్టించుకోలేదు. మరోసారి ఏసీపీకి ఫిర్యాదు చేసిన.. సరైన స్పందన రాలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇదే విషయాన్ని కూతురికి వివరించాడు. పోలీసుల నుంచి సహకారం రాకపోవడంతో.. ప్రీతి ఆత్మహత్యాయ్నం చేసింది.

ఈ ఆరోపణల్లో మంత్రి పేరు రావడం చర్చనీయంశంగా మారింది. తనకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయని సైఫ్‌ వేధిస్తున్నట్లు ప్రీతి తన తండ్రికి తెలిపింది.

దీంతో ప్రీతి ఫోన్ ను పోలీసులు పరిశీలించారు. సైఫ్‌పై ఇప్పటికే ఎస్సీ,ఎస్టీ, అట్రాసిటీ, ర్యాగింగ్‌ కేసులు నమోదు చేశారు.

అత్యంత విషమంగా ప్రీతి ఆరోగ్యం.. (Preeti Suicide Attempt)

ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి విషమంగానే ఉంది. ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రీతి కిడ్నీ, గుండె పనితీరు కాస్త మెరుగవుతుందని వైద్యులు వివరించారు. ప్రీతిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యులు తెలిపారు.

హైదరాబాద్‌ కు చెందిన ప్రీతి అనే అమ్మాయి.. కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

అయితే, సీనియర్ వైద్య విద్యార్థి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బాధిత విద్యార్ధిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు చేసిన కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ప్రీతి బుధవారం మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

వెంటనే అప్రమత్తమైన సహా విద్యార్థులు, వైద్య సిబ్బంది వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు మార్చారు.

బాధితురాలి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హూటాహుటిన వరంగల్ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.

ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని అక్కడి విద్యార్ధులు అంటున్నారు.

సైఫ్ కు మద్దతుగా విద్యార్ధుల ఆందోళన..

వరంగల్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్ధి సైఫ్ కు మద్దతుగా వైద్య విద్యార్ధులు ఆందోళన చేపట్టారు.

విచారణ కొనసాగుతుండగా.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విద్యార్ధులు ఆరోపించారు.

ఈ మేరకు ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను బహిష్కరించారు. సైఫ్‌కు మద్దతుగా ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు.

సైఫ్‌పై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్‌ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు.