Last Updated:

break in Rahul’s walk: రాహుల్ పాదయాత్రకు చిన్న బ్రేక్

భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ తలపెట్డిన భారత్ జోడో యాత్రకు నేడు విరామం ఇచ్చారు

break in Rahul’s walk: రాహుల్ పాదయాత్రకు చిన్న బ్రేక్

Rahul Gandhi: భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ  చిన్న బ్రేక్ ఇచ్చారు. సెప్టెంబర్ 7 నుండి చేపట్టిన పాదయాత్రలో రాహుల్ తో పాటుగా సిబ్బంది కూడా కొంత ఇబ్బంది పడుతుండడంతో ఈ నిర్ణయం తీసుకొన్నారు. దీంతో నేడు పాదయాత్ర చేపట్టేలేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

నిన్నటిదినం తిరువనంతపురంలోని శివగిరి మఠాన్ని సందర్శించిన రాహుల్ ప్రముఖ తత్వవేత్త, సంఘ సంస్కర్త నారాయణ గురుకు నివాళులర్పించారు. గురు భోధనలకు విరుద్దంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నడుచుకొంటున్నాయని రాహుల్ ఆరోపించారు. హింస, ద్వేషాలే ప్రధానంగా ఉన్నయంటూ విమర్శించారు. కేరళలో మొత్తం 18 రోజుల పాటు భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ నెల చివరకు కర్ణాటకలోకి రాహుల్ పాదయాత్ర చేరుకొనేలా రూట్ మ్యాప్ లో ఉంది.

ఇవి కూడా చదవండి: