Last Updated:

France: 300 మంది భారతీయ ప్రయాణీకులు ఉన్న విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్

'మానవ అక్రమ రవాణా' అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .

France: 300 మంది భారతీయ ప్రయాణీకులు ఉన్న విమానాన్ని అదుపులోకి తీసుకున్న ఫ్రాన్స్

France: ‘మానవ అక్రమ రవాణా’ అనుమానంతో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు వెళ్తున్న విమానాన్ని ఆపిన ఫ్రెంచ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై భారతీయ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు .

ట్రాఫికింగ్ ఆరోపణలు ..(France)

రొమేనియన్ చార్టర్ కంపెనీ లెజెండ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం 303 మంది భారతీయ ప్రయాణికులతో నికరాగ్వాకు బయలుదేరింది. ఇది తూర్పు ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఆగింది. కొంతమంది ప్రయాణీకులు చట్టవిరుద్ధంగా సెంట్రల్ అమెరికా ద్వారా యునైటెడ్ స్టేట్స్ లేదా కెనడాకు చేరుకోవడానికి ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్యారిస్ ప్రాసిక్యూటర్ ప్రకారం ప్రయాణీకులలో మానవ అక్రమ రవాణా బాధితుల గురించి విమానం గ్రౌండింగ్ చేయబడింది.

ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం దీనిపై సామాజిక మాధ్యమం X లో ఈ విధంగా పోస్ట్ చేసింది. ఫ్రెంచ్ అధికారులు 303 మంది భారతీయ ప్రయాణీకులు ఉన్న దుబాయ్ నుండి నికరాగ్వాకు వెళ్లే విమానాన్ని ఫ్రెంచ్ విమానాశ్రయంలో సాంకేతికంగా నిలిపివేసినట్లు మాకు తెలియజేశారు. ఎంబసీ బృందం అక్కడికి చేరుకుని యాక్సెస్ కాన్సులర్‌ను పొందింది. మేము పరిస్థితిని పరిశీలిస్తున్నాము. ప్రయాణీకులు క్షేమంగా ఉన్నారు. ఫ్రాన్స్‌లో దిగిన తర్వాత ప్రయాణీకులను మొదట విమానంలో ఉంచారు. తరువాత విమానాశ్రయ టెర్మినల్‌లో వసతి కల్పించారు. వారి సౌకర్యం కోసం వ్యక్తిగత పడకలు అందించడం జరగింది. వారు విమానాశ్రయంలో రాత్రి గడిపారు. వారు తమ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఎప్పుడు అనుమతిస్తారో అధికారులు ఇంకా నిర్ధారించలేదు.