TS 10th Results 2025: బిగ్ అప్డేట్.. పదో తరగతి ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చేక్ చేసుకోండి!

TS 10th Results 2025: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 92.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే 1.47 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. గురుకులాల విద్యార్థులు 98.7 శాతం, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 94.21 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. ఫలితాల కోసం bse.telangana.gov.in లింకు క్లిక్ చేయాలి.
ఈ ఫలితాల్లో బాలికలదే మళ్లీ పైచేయిగా నిలిచారు. బాలురు 91.32 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ తెలిపింది. మొత్తం 4,629 పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు రాగా, 2 పాఠశాలల్లో సున్నా శాతం ఫలితాలు రావడం ఆశ్యర్యానికి గురిచేసింది. ఇక, మహబూబాబాద్ జిల్లా టాపర్ గా నిలిచింది. ఈ జిల్లాలో 99.29 శాతం నమోదవ్వగా.. వికారాబాద్ చివరిస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 73.97శాతం నమోదయ్యాయి.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రభుత్వం సీజీపీఏ విధానాన్ని తొలగించింది. ఇందు కోసం సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడింగ్ ఆధారంగా ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 5లక్షల మంది హాజరయ్యారు. అలాగే ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్కు రూ.500 చెల్లించగా.. రీవెరిఫికేషన్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
ఇక, పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ మేరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 నిమిషాల వరకు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీని మే 16 గా గడువు విధించింది. అలాగే ఆన్ లైన్లో ఫీజు చెల్లించేందుకు మే 17 చివరి తేదీగా పేర్కొంది.