Last Updated:

Jio: 11 నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.

Jio: 11 నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో

Jio: రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ నగరాల్లో 5G సేవలను ప్రారంభించిన మొదటి మరియు ఏకైక ఆపరేటర్‌గా రిలయన్స్ జియో అవతరించింది.ఈ నగరాల్లోని జియో వినియోగదారులు ఈరోజు నుండి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా 1 Gbps+ వేగంతో అపరిమిత డేటాను పొందుతారు.

ఈ సందర్భంగా జియో ప్రతినిధి మాట్లాడుతూ, ఈ 11 నగరాల్లో జియో ట్రూ 5Gని విడుదల చేయడం మాకు గర్వకారణం. ఈ నగరాలు ముఖ్యమైన పర్యాటక గమ్యస్థానాలు మరియు మన దేశంలోని ముఖ్య విద్యా కేంద్రాలు. జియో యొక్క ట్రూ 5G సేవలను ప్రారంభించడంతో, ఈ ప్రాంత వినియోగదారులు ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను పొందడమే కాకుండా, సుపరిపాలన రంగాలలో అనంతమైన వృద్ధి అవకాశాలను కూడా పొందుతారు. మా అన్వేషణలో వారి నిరంతర మద్దతు ఇచ్చినందుకు చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్, పంజాబ్, హర్యానా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్జతలు చెబుుతన్నట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: