Home / తాజా వార్తలు
జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.
విభిన్నమైన కంటెంట్ ఎంపికలను అందించే ప్రయత్నంలో, ఎలోన్ మస్క్ యొక్క ట్విట్టర్ "ఆర్టికల్స్" అనే కొత్త ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్లో సుదీర్ఘమైన మరియు క్లిష్టమైన కథనాలను, పుస్తకాలను ప్రచురించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ మొదట కెనడా, ఘనా, యూకే మరియు యూఎస్ లోని వినియోగదారులకు గత ఏడాది జూన్లో అందుబాటులోకి వచ్చింది.
జాన్సన్ & జాన్సన్ తన బేబీ పౌడర్కు గురికావడం వల్ల క్యాన్సర్ వచ్చిందని చెప్పిన కాలిఫోర్నియా వ్యక్తికి $18.8 మిలియన్లు చెల్లించాలని యూఎస్ కోర్టు ఆదేశించింది. దీనితో టాల్క్ ఆధారిత ఉత్పత్తులపై వేలకొద్దీ కేసులను పరిష్కరించాలని కోరుతూ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఏపీ రాజకీయాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామ జోగయ్య సంచలన విశ్లేషణ చేశారు. ఎన్డిఎ మిత్ర పక్షాల ఆత్మీయ సమావేశానికి పవన్ కళ్యాణ్ని పిలవడమంటే తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఆయన చరిష్మాని ఉపయోగించడం ద్వారా లబ్ధి పొందాలనేదే ధ్యేయంగా కనిపిస్తోందని జోగయ్య అంచనా వేశారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీ చేసే చలానాలు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే ఢిల్లీ లోని 20,000 వాహనాలు ఒక్కొక్కటి 100కి పైగా చలాన్లను అందుకున్నాయి. అయితే వాటి యజమానులు ఇంకా జరిమానాలు చెల్లించడానికి పట్టించుకోలేదు.
సింగపూర్ పాస్పోర్ట్ 192 దేశాలకు వీసా రహిత ప్రయాణంతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా నిలిచింది. ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. జూలై 18న విడుదల చేసిన కొత్త జాబితా ప్రకారం గతంలో టాప్ ర్యాంక్ హోల్డర్గా ఉన్న జపాన్ మూడో ర్యాంక్కు దిగజారింది.
జనగామ పోలీసు స్టేషన్ కు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డి చేరుకున్నారు. తన విధులకి ఆటంకం కలిగిస్తోందంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గతంలో పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో తుల్జా భవాని రెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు.
మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధరన్తో భేటీ అయ్యారు. ఈ అల్పాహార సమావేశంలో పవన్తోపాటు నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. 15 నిమిషాల పాటు ఏపీ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు.
కొలంబియాలో తూర్పు మైదానాలకు బొగోటాను కలిపే కీలకమైన హైవే పై కొండచరియలు విరిగిపడి చేరిన బురద తో 15 మంది మరణించారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ఈ ప్రాంతంలో మూడు వాగులు పొంగి పొర్లుతున్నాయి.
మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.