TBJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవం

BJP State President: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సీనియర్ నాయకులు, ఏబీవీపీ నేత, ప్రముఖ న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మన్నగూడలో జరిగే సన్మాన సభలో రాంచందర్ రావును అధ్యక్షుడిగా సంస్థగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మన్నేడలో ఏర్పాటు చేసిన సన్మాన సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరితో పాటు తెలంగాణ కీలక బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.
ఈ క్రమంలో ర్యాలీగా కార్యకర్తలతో కలిసి వేద కన్వెన్షన్ కు చేరుకున్న నూతన అధ్యక్షుడు రాంచందర్ రావుకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు ఘన స్వాగతం పలికారు. నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కాసేపట్లో సంస్థాగత ఎన్నికల అధికారి శోభ కరండ్లాజే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు పేరును ప్రకటించనున్నారు.