Home / తెలంగాణ
Padi Kaushik Reddy Arrested in Hyderabad: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబెదారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసి అక్కడి నుంచి వరంగల్కు తరలించారు. ఈ మేరకు ఆయనపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో 308(2), 308(4), 352 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఏప్రిల్ 21వ తేదీన కౌశిక్ […]
Konda Surekha Sensational Comments On Kadiyam Srihari : తన మంత్రి పదవి పోతుందంటూ కడియం శ్రీహరి తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. తన ముందు కూర్చోవడానికి నామోషీగా ఫీలవుతున్నారన్నారు. శుక్రవారం మీడియాతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడియంపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి వద్ద కడియం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీడీపీలో నడిపించుకున్నట్లు.. ఇక్కడ కూడా నడిపించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. […]
Banakacharla Project: బనకచర్ల ప్రాజెక్టు గురించి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం ఉండదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బనకచర్ల-గోదావరి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని రేవంత్ ప్రకటించారు. ఏపీ కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్ల వివాదం మొదలైందన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చేముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీ ప్రీ ఫీజిబులిటి రిపోర్ట్ (పీఎఫ్ఆర్) ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తోందన్నారు. బనకచర్లపై కేంద్రం అన్నిరకాల చర్యలకు […]
MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు తీసేసి, వాటిలోని పైపులను వాడుకోవాలని సూచించారు. మూడు బ్యారేజీల మరమ్మతులకు రూ.20వేల కోట్లు ఖర్చు అవుతోందని తెలిపారు. అంత ఖర్చు పెట్టినా వరద ఉద్ధృతి వల్ల బ్యారేజీలు కొట్టుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. మూడు ప్రాజెక్టులకు పెట్టే ఖర్చుకు బదులు ప్రాణహిత పూర్తిచేస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాజెక్టులు […]
Six Detonators Found In Hanumakonda Court: దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట బాంబు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఆగంతకులు నిత్యం ఇలాంటి బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాలు, రైళ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, పబ్లిక్ ప్లేసులు ఇలా అన్నిచోట్ల బాంబు బెదిరింపు హెచ్చరికలు వస్తున్నాయి. దీంతో అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే హన్మకొండలో జరిగింది. హన్మకొండ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణంలో […]
Brahmos Aerospace Expansion: రక్షణ రంగానికి చెందిన కీలక ప్రాజెక్ట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల ప్రాధాన్యత ఏంటో తెలిసిన తరుణంలో మిస్సైళ్ల ఉత్పత్తిని పెద్దఎత్తున పెంచాలని కేంద్రం భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా బాలానగర్ లో ఇప్పటికే మిస్సైల్ తయారీ కేంద్రం ఏర్పాటైంది. దీన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. […]
CM Revanth Reddy Meets former British Prime Minister: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సీఎం రేవంత్రెడ్డి గురువారం ఢిల్లీలో భేటీ అయ్యారు. గంటసేపు సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ఆవిష్కరించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమ వివరాలను సీఎం టోనీ బ్లెయిర్కి అందజేశారు. రైతులు, యువత, మహిళలు, వివిధ వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. కోర్ అర్బన్, పెరి-అర్బన్, […]
Harish Rao criticized CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సెటైర్లు వేశారు. బహుషా బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిన్ల మీద లేదని విమర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. గురువారం తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్కు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. తెలంగాణ పరువు పోయిందని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బనకచర్ల ఏ బేసిన్లో […]
Ponguleti Srinivasa Reddy Sensational Comments on KCR: మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అర్హులైన 205 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాటల మాంత్రికుడు కేసీఆర్ అన్నారు. వాసాలమర్రికి చేసిందేమీ లేదని, దత్తత పేరుతో ఆగం చేశారన్నారు. […]
CM Revanth Reddy Meets Union Water Resources Minister CR Patil: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బృందం ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. సమావేశంలో ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గోదావరి-బనచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలను సీఎం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్ బాబుతో కలిసి కేంద్రమంత్రికి వివరించారు. ప్రాజెక్టు తెలంగాణ […]