Home/Tag: Telangana Assembly
Tag: Telangana Assembly
Hate Speech: హేట్ స్పీచ్‏కు చెక్..!
Hate Speech: హేట్ స్పీచ్‏కు చెక్..!

March 30, 2026

hate speech: రాష్ట్రంలో హేట్ స్పీచ్‏ను అరి కట్టే బిల్లును రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 'తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లు 2026 ను సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో భాగంగా హేట్ స్పీచ్, హేట్ క్రైమ్న కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ నేరాలుగా గుర్తించారు. ద్వేషపూరిత వ్యాఖ్యలు, రాతలు, సంకేతాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వ్యక్తి లేదా వర్గంపై ద్వేషం, విద్వేషం రెచ్చగొట్టే చర్యలను హేట్ స్పీచ్‌గా నిర్వచించారు.

Read More
Telangana Assembly: ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం
Telangana Assembly: ‘తల్లిదండ్రుల సంరక్షణ’ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం

March 29, 2026

telangana assembly : తెలంగాణ శాసనసభలో ఒక చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు ముకుతాడు వేస్తూ, వారి సంరక్షణను బాధ్యతగా మార్చే ‘ఉద్యోగుల జవాబుదారితనం తల్లిదండ్రుల పోషణ - పర్యవేక్షణ బిల్లు-2026’ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ప్రసంగించారు. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో సమాజంలో మారుతున్న మానవ సంబంధాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ శక్తినంతా ధారపోస్తారని, కానీ పిల్లలకు రెక్కలు వచ్చాక వారిని గాలికొదిలేయడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

Read More
Deputy CM Bhatti Vikramarka: అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం దురదృష్టకరం..
Deputy CM Bhatti Vikramarka: అప్రజాస్వామిక చర్యలకు పాల్పడటం దురదృష్టకరం..

March 29, 2026

deputy cm bhatti vikramarka: ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలబడి చర్చలు జరపాల్సిన సభను, ప్రతిపక్ష సభ్యులు తమ స్వార్థ రాజకీయాల కోసం అడ్డుకోవడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (deputy cm bhatti vikramarka) శాసన సభలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో మేము ప్రవేశపెట్టిన అందరికీ బీమా, విద్యార్థులకు అల్పాహారం వంటి ప్రజా సంక్షేమ పథకాలపై చర్చ జరగకుండా అడ్డుపడటం ప్రజలను వంచించడమేనని ఆయన తెలిపారు.

Read More
BRS MLAs Suspension: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్
BRS MLAs Suspension: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

March 29, 2026

brs mlas suspension: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన మైనింగ్ అక్రమాలపై సభా కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు.

Read More
Telangana Assembly: సీపీపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే
Telangana Assembly: సీపీపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే

March 28, 2026

telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (cp)పై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (mla padi kaushik reddy) సంచలన ఆరోపణలు చేశారు. పోలీసు శాఖలో జరుగుతున్న అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ఆయన నేరుగా సభ దృష్టికి తీసుకువస్తూ సీఐడీ (cid) విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Read More
Telangana Assembly: ప్రభుత్వం కీలక బిల్లు.. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత
Telangana Assembly: ప్రభుత్వం కీలక బిల్లు.. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత

March 28, 2026

telangana assembly budget sessions: వయోవృద్ధులు తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం తెలంగాణ సర్కారు కీలక బిల్లు సిద్ధం చేసింది. శనివారం శాసనసభలో ప్రభుత్వం ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టనుంది.

Read More
Minister Ponnam Prabhakar: పోలీసుల పదోన్నతులపై మంత్రి కీలక ప్రకటన
Minister Ponnam Prabhakar: పోలీసుల పదోన్నతులపై మంత్రి కీలక ప్రకటన

March 26, 2026

minister ponnam prabhakar: హోంశాఖలో పోలీసుల పదోన్నతుల (police promotions)పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (minister ponnam prabhakar) సమాధానం చెప్పారు. పదోన్నతులు ఖాళీల లభ్యత ఆధారంగా ఉంటాయని.. ఎప్పటికప్పుడు ఏర్పడిన ఖాళీలను అనుసరించి అర్హులైన పోలీస్ కానిస్టేబుల్‏లను హెడ్ కానిస్టేబుల్‏గా పదోన్నతులు కల్పించడం జరిగిందని వివరించారు. 6/12/18/24 సంవత్సరాల కాలపరిమితి లోపు పదోన్నతులు పొందని కానిస్టేబుల్‏లు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అనగా ఎస్జీపీ/ ఎస్‏పిపి -1 ఏ/ ఎస్‏పిపి -1బి/ ఎస్‏పిపి - 2 స్కేల్‏ల మంజూరుకి అర్హులవుతారని పేర్కొన్నారు.

Read More
CM Revanth Reddy: ఆ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత..
CM Revanth Reddy: ఆ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత..

March 26, 2026

cm revanth reddy: ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) పునరుద్ఘాటించారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూనే, నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి, అవసరమైతే మరిన్ని నిధులను సమకూర్చుతామని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా ఇప్పటివరకు అత్యధికంగా నిధులు వెచ్చించినట్టు సీఎం వివరించారు.

Read More
CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై అపోహలు వద్దు..
CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై అపోహలు వద్దు..

March 26, 2026

cm revanth reddy: ఆరోగ్య శ్రీ (arogya sri)పై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ బకాయిల భారం మోస్తూనే పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని చెప్పారు. 2023 డిసెంబర్ 7 నాటికి గత ప్రభుత్వం రూ.627 కోట్లు పెండింగ్ పెట్టిందని అన్నారు. తాము అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2408 కోట్లు చెల్లించామని అన్నారు.

Read More
CM Revanth Reddy: బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని మోస్తున్నాం: సీఎం రేవంత్
CM Revanth Reddy: బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని మోస్తున్నాం: సీఎం రేవంత్

March 26, 2026

cm revanth reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి రూ.600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతినెలా రూ.89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Read More
Telangana assembly: ఇప్పసారా రచ్చ.. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం
Telangana assembly: ఇప్పసారా రచ్చ.. రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో గందరగోళం

March 25, 2026

mla rakesh reddy comments: బడ్జెట్‌ పద్దులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యల పట్ల మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పపువ్వు సారా అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది.

Read More
Indiramma houses: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Indiramma houses: ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

March 25, 2026

indiramma houses: ఇందిరమ్మ ఇండ్లపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (minister ponguleti srinivas reddy) కీలక ప్రకటన చేశారు. ఈనెల 31 నాటికి లక్షా 12 వేల ఇండ్లు పూర్తి కావొస్తున్నాయని, వివిధ నిర్మాణ దశల్లో ఉన్నమరో లక్ష ఇందిరమ్మ ఇండ్లు (indiramma houses) జూన్ నెల వచ్చేసరికి పూర్తి కంప్లీట్ అవుతాయని తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల నుంచి రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల (indiramma houses) కేటాయిం పులు చేపడుతామని ప్రకటించారు.

Read More
TG Assembly: శ్రీధరన్న నన్ను పగబట్టకే.. అసెంబ్లీలో మల్లారెడ్డి సెటైర్లు
TG Assembly: శ్రీధరన్న నన్ను పగబట్టకే.. అసెంబ్లీలో మల్లారెడ్డి సెటైర్లు

March 24, 2026

tg assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగింది. ఈ చర్చలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి సభను ఆకట్టుకోవడమే కాక నవ్వులు పూయించారు.

Read More
CM Revanth Reddy: నగరం 4 వైపులా ఎలివేటెడ్ కారిడార్స్
CM Revanth Reddy: నగరం 4 వైపులా ఎలివేటెడ్ కారిడార్స్

March 23, 2026

cm revanth reddy: హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ సమస్యను అధిగమించేందుకు నాలుగు వైపులా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) చెప్పారు. ఇవాళ శాసన మండలిలో సీఎం మాట్లాడారు. సిటీ నుంచి సిటీ బయటకు వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుందని.. దీనికితోడు ట్రాఫిక్ కష్టాలు తప్పటం లేదన్నారు. భవిష్యత్‏లో పెరగనున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సిటీ వెలుపల అభివృద్ధికి అద్భుతమైన ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. సిటీ చుట్టూ నాలుగు ఎలివేటెడ్ కారికార్ల నిర్మాణానికి ప్రణాళిక రెడీ చేసినట్లు వివరించారు సీఎం.

Read More
Deputy CM Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
Deputy CM Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన

March 23, 2026

deputy cm bhatti vikramarka: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల డీఏ బకాయిలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా అందించిన ఈ సమాచారం పెద్ద ఊరటనిచ్చే అంశం. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ (da) బకాయిలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం గమనార్హం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించిన కీలక వివరాలు వెల్లడించారు.

Read More
Telangana Assembly: తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Telangana Assembly: తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్

March 18, 2026

telangana assembly: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ (brs) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన ఈ చర్చ చివరకు బీఆర్ఎస్ వాకౌట్‌కు దారితీసింది. మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని, తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం ఈ అవినీతికే వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (dpr) సిద్ధం కాలేదని స్వయంగా ఎండీ చెప్పారని, కానీ ప్రభుత్వం మాత్రం ఉందని అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో పేదల ఇళ్లను అమానవీయంగా కూల్చేశారని మండిపడ్డారు.

Read More
Harish Rao: మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.. గన్ పార్క్ వద్ద భారీ నిరసన
Harish Rao: మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.. గన్ పార్క్ వద్ద భారీ నిరసన

March 18, 2026

harish rao: తెలంగాణలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ (brs) పార్టీ నాయకులు గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చేతుల్లో మొక్కజొన్న కంకులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఎంట్రన్స్ వద్ద మార్షల్స్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేతిలో నుంచి మొక్కజొన్నను లాక్కొని చీఫ్ మార్షల్ క్రింద పోయడంతో ఎంట్రన్స్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన దిగారు.

Read More
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం

March 17, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. telangana assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్య వాడీవేడి చర్చలతో దద్దరిల్లాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి కేటీఆర్, మంత్రుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.

Read More
Governor: ‘2047 తెలంగాణ రైజింగ్’ దిశగా అడుగులు: గవర్నర్‌
Governor: ‘2047 తెలంగాణ రైజింగ్’ దిశగా అడుగులు: గవర్నర్‌

March 16, 2026

governor shiv pratap shukla speech in assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ప్రసంగించారు. ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా బడ్జెట్‌ ఉండనుందని తెలిపారు.

Read More
Governor: అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
Governor: అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్

March 16, 2026

governor: అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. శాసన మండలి భవనం ముందు ఏర్పాటు చేసిన విగ్రహాన్ని గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆవిష్కరించారు.

Read More
Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
Telangana Assembly: నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

March 16, 2026

telangana assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.45 గంటలకు గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Read More
Assembly: మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Assembly: మార్చి 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

February 23, 2026

assembly: మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్చి 16న గవర్నర్ ప్రసంగం, 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది.

Read More
Minister Sridhar Babu: నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలనేదే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్‌ బాబు
Minister Sridhar Babu: నగరవాసులను కాలుష్యం నుంచి రక్షించాలనేదే మా లక్ష్యం: మంత్రి శ్రీధర్‌ బాబు

January 6, 2026

minister sridhar babu: భవిష్యత్‌ తరాల కోసం హిల్ట్‌ పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. హిల్ట్‌ పాలసీని సాదాసీదా భూమార్పిడిగా చూస్తున్నారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. దీనిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామని చెప్పుకొచ్చారు.

Read More
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు
Its worse than Kaurava Sabha: అసెంబ్లీ గౌరవ సభ కాదది.. కౌరవ సభ అంటూ కేటీఆర్‌ ఘాటు వ్యాఖ్యలు

January 6, 2026

its worse than kaurava sabha said by ktr: బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కేటీఆర్‌ వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలో జనగాంలో నిర్వహించిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడారు. కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే.. అనే కాళోజీ సిద్ధాంతం నిజం చేయడం కోసం జనం ఎదురు చూస్తున్నారని అన్నారు

Read More
Deputy CM Bhatti: 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్‌ ల్యాబ్‌ ప్రారంభిస్తాం: భట్టి విక్రమార్క!
Deputy CM Bhatti: 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్‌ ల్యాబ్‌ ప్రారంభిస్తాం: భట్టి విక్రమార్క!

January 6, 2026

deputy cm bhatti vikramarka on singareni: సింగరేణి కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మార్చి 2026 నాటికి సింగరేణి ఆసుపత్రులలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. 75 రోజుల్లో గోదావరి ఖనిలో క్యాత్‌ ల్యాబ్‌ ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు

Read More
Page 1 of 3(70 total items)