_1773636996047.jpg&w=1920&q=80)
Warangal: అమెరికాలో వరంగల్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
March 16, 2026
warangal : అమెరికాలో స్థిరపడిన వరంగల్ వాసి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ తాడిపత్రి రాకేశ్ (40) ఆకస్మిక మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటున్న ఆయన, భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. వరంగల్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జితేందర్ కుమారుడైన రాకేశ్, గత పదేళ్లుగా అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో నివసిస్తోంది. 2014లో కరీంనగర్కు చెందిన తేజస్వినితో రాకేశ్కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read More


_1773644765814.jpg&w=1920&q=75)