_1773724631321.jpg&w=1920&q=80)
March 17, 2026
raashi khanna: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించాలనే తన కల "ఉస్తాద్ భగత్ సింగ్" చిత్రంతో నెరవేరిందని నటి రాశీ ఖన్నా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నెల 19న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. రాశీ ఖన్నా తన సినీ కెరీర్లో కథ వినకుండానే ఓకే చెప్పిన ఏకైక సినిమా ఇదేనట. "నేను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచే పవన్ కల్యాణ్ గారి స్టార్డమ్, పవనిజం గురించి వింటున్నాను. ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలని అప్పుడే అనుకున్నాను. అందుకే హరీశ్ శంకర్ గారు అడగ్గానే మరో ఆలోచన లేకుండా వెంటనే ఒప్పుకున్నాను" అని ఆమె తెలిపారు.
Read More




