Census: జన గణన.. సేకరణ లెక్కలన్నీ గోప్యంగా ఉంచుతాంMarch 30, 2026
census: జన గణనపై సెన్సెస్ రిజిస్ట్రార్ జనరల్ మృత్యుంజయ మీడియా సమావేశం నిర్వహించారు. రెండు విడతల్లో జన గణన నిర్వహిస్తామని, జనాభా సేకరణ లెక్కలన్నీ గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. తొలి విడతలో గృహాల లెక్కింపు ఉంటుందని, ప్రతి ఇల్లు పరిస్థితి, సౌకర్యాలు, ఆస్తులు తదితర వివరాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఏపీలో మే 1 నుంచి 30 వరకు జనగణనలో ఇళ్ల సర్వే నిర్వహించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం ఉందని తెలిపారు. అలాగే తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణనలో ఇళ్ల సర్వే, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపారు. సెల్ఫ్ అన్యుమరేషన్లో ప్రజలు సొంతంగా జనాభా లెక్కల వెబ్సైట్లో ఇళ్ల సర్వే వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Read More