April 26, 2026
parvathipuram:అమాయకత్వానికి నిలువుటద్దం ఆ గిరిజన బిడ్డలు. వారి తల్లిదండ్రుల కలలు కొండలంత ఎత్తైనవి. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నా, తమ బిడ్డ చదువుకుని పట్టణాల్లో పెద్ద ఉద్యోగం చేయాలని, తమ తలరాతను మార్చాలని ఆ కన్నప్రేమ ఆరాటపడుతుంది. అందుకే, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కళ్లముందు ఉంచుకోలేక, భవిష్యత్తుపై ధీమాతో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చేరుస్తున్నారు. కానీ, అక్కడ ఆ బిడ్డలకు రక్షణ కరువవుతోంది. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారుతుండటంతో, గిరిజన గూడాల్లో కడుపుకోత మిగులుతోంది.
Read More


