
Speaker Prasad Kumar:ఎమ్మెల్యేల పిరాయింపుల కేసు.. దానం, కడియంలకు క్లీన్ చిట్
March 11, 2026
speaker prasad kumar:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్పై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు పెద్ద ఊరట లభించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.





