
Encounter in Maharashtra:గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు మృతి
February 7, 2026
encounter in maharashtra:మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా భ్రమగడ్ తాలుకా ఫడేవా అటవీ ప్రాంతం మరోసారి రక్తపాతానికి వేదికైంది. మావోయిస్టులు–భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 7మంది మావోయిస్టులు మృతి చెందగా సీ-60 కమాండో కానిస్టేబుల్ దీపక్ చిన్న మదవి మంద్రా (38) వీరమరణం పొందారు. ఘటన స్థలంలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.






