Telangana Assembly: తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్March 18, 2026
telangana assembly: తెలంగాణ అసెంబ్లీ వేదికగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ (brs) నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన ఈ చర్చ చివరకు బీఆర్ఎస్ వాకౌట్కు దారితీసింది. మాజీ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని, తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం ఈ అవినీతికే వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక (dpr) సిద్ధం కాలేదని స్వయంగా ఎండీ చెప్పారని, కానీ ప్రభుత్వం మాత్రం ఉందని అబద్ధాలు చెబుతోందని ధ్వజమెత్తారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాల్లో పేదల ఇళ్లను అమానవీయంగా కూల్చేశారని మండిపడ్డారు.
Read More