sit notices to mp santosh kumar: ఫోన్ ట్యాపింగ్ కేసులోమరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్యనేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
telangana: రేపు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కేటీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ బృందం కలవనుంది. సింగరేణి కుంభకోణం అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ను కలవాలని నిర్ణయించుకుంది.
municipal elections 2026: మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇన్ఛార్జిలను నియమించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా సమన్వయకర్తల జాబితాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు.
ponnam prabhakar: గత బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత అడిగిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేదని ఆయన పేర్కొన్నారు.
cm revanth reddy tour in khammam: తన రాజకీయ ప్రయాణాన్ని మొదట ఖమ్మం జిల్లాలో ప్రారంభించానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన సీఎం.. రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ktr sensational comments:తెలంగాణలో రేవంత్ రెడ్డి పిచ్చి తుగ్లక్లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్ చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సికింద్రబాద్లో శాంతియుత ర్యాలీని నిర్వహించింది. ఈ ర్యాలీ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు.
brs peaceful rally in secunderabad:సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. సికింద్రబాద్ను మున్సిపల్ కార్పొరేషణ్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఇవాళ సికింద్రబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీకి సిద్ధమయ్యారు. ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
cm revanth reddy speech at shilpakalavedika: గత ప్రభుత్వ పెద్దల ఉద్యోగాలు ఊడగొట్టి తమకు ఉద్యోగాలు ఇచ్చే ప్రజాప్రభుత్వాన్ని యువత ఎన్నుకుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
minister ponnam's sensational comment: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని పొన్నం తెలిపారు. ఇవాళ కరీంనగర్లోని శ్రీ గిద్దె పెరుమాండ్ల స్వామి దేవాలయాన్ని మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
harish rao's anger over the illegal arrest of journalists: మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పాలించడం చేతకాని రేవంత్ సర్కార్.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా ప్రతినిధులను, డిజిటల్ జర్నలిస్టులను పోలీసులు టార్గెట్ చేయడంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
harish rao's goal is to raise the pink flag: తర్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
cm revanth reddy's key decision:తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో రానున్న మున్సిపల్ ఎన్నికలపై కన్నేసింది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.
sensational comments of bandi sanjay:కృష్ణా జలాల అంశంలో కేసీఆర్ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 571 టీఎంసీలు రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే కేసీఆర్ ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. ఇవాళ కరీంనగర్లో బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజజ్ పాల్గొని ప్రసంగించారు.
mlc kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇవాళ జరుగుతున్న శాసనమండలిలో కంటతడి పెట్టుకున్నారు. అన్ని ఆలోచించే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. దయచేసి తన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ గుతాసుఖేందర్ను మరోసారి విన్నవించారు.
big relief for harish rao in phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్రావును విచారించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ సర్కార్ ఇటీవల సుప్రీంకోర్టులో ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ ఆ పిటిషన్పై సుప్రింకోర్టులో జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు తిర్పును ఇచ్చింది.
talasani srinivas yadav vs duddilla sridhar babu - తెలంగాణ అసెంబ్లీలో నాయకుల మధ్య చర్చలు వాడి వేడిగా సాగుతున్నాయి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబును సభ నడిపించే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు.
kcr master plan: మొన్నటివరకు ఫామ్ హౌస్ కు పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇపుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు.
bandi sanjay sensational comments on upa govt.: కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలే ప్రధాన కారణమని మండిపడ్డారు. ఈ రోజు కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. కృష్ణ జలాలు, పాలమూరు–రంగారెడ్డిపై ఇటీవల కేసీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దానికి సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. నీళ్లు నిజాలు పేరిట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దీనిపై బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు.
kalvakuntla kavitha emotional comments: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 ఏడాది తనకు సరిగ్గా కలిసి రాలేదని మంగళవారం భావోద్వేగానికి గురయ్యారు. 2025 తొలి నాటి నుంచి ఏడాది ముగిసే వారకు తనపై ఎన్నో కుట్రలు జరిగాయని వెల్లడించారు
minister uttamkumar fires on harish rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావుపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరిగేషన్లో తానే మాస్టర్ అని హరీశ్ రావు అనుకుంటున్నారని.. హరీశ్ రావుకు అంత అహంకారం ఎందుకని మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. హరీశ్రావు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు
congress leaders react to ktr behavior in telangana assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు సోమవారం ఆసక్తికరంగా కొనసాగాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి కరచాలనం చేశారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు సమితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు లేచి నిల్చుని నమస్కారం చేశారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది
cm revanth reddy chitchat with media in assembly about kcr: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలిరోజు సభ ప్రారంభంలో దివంగత మాజీ ఎమ్మెల్యేలకు సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. తొలి రోజు సభ వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులు, విప్లతో తన ఛాంబర్లో సమావేశమయ్యారు.
ktr's sensational comments: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మళ్లీ బీఆర్ఎస్లోకి డోర్స్ క్లోజ్ చేశామన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో చిట్ చాట్లో ఆయన మాట్లాడారు