April 17, 2026
anakapalli earthquake:అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు కలకలం రేపాయి. గురువారం అర్ధరాత్రి సుమారు 12:30 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు స్వల్ప ప్రకంపనలు సంభవించాయని స్థానికులు తెలిపారు. ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు రాంబిల్లి మండలంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు సమాచారం. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా మంచాలు, ఫర్నిచర్ కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు.
Read More


