
February 24, 2026
air ambulance crashes in jharkhand:జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ జార్ఖండ్ రాష్ట్రం చత్రా జిల్లాలో కుప్పకూలింది. టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాలకే విమానంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అనంతరం చత్రా సమీపంలోని అడవి ప్రాంతంలో విమానం శిథిలాలుగా మారినట్లు గుర్తించారు.







