Home / YCP leaders
Lookout Notices Issued to Former Minister Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని మరోసారి బిగ్ షాక్ తగిలింది. తాజాగా, ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ టుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ముంబైలో కొడాలి నానికి గుండె ఆపరేషన్ చేసుకున్నారు. వివరాల ప్రకారం.. కొడాలి నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అక్రమాలపై […]
Gorantla Madhav Arrested: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన చేబ్రోలు కిరణ్పై మాధవ్ దాడికి యత్నించాడు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ను మంగళగిరి పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. అయితే మంగళగిరి నుంచి గుంటూరు వరకు […]
Kakani Govardhan Reddy : పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. అన్ని విమానాశ్రయాలు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. మరోవైపు పోలీసులు అతడికి మూడుసార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. 12 రోజులుగా కాకాణి గోవర్ధన్రెడ్డి, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి జాడ కోసం […]
Big Shock To YCP MP Mithun Reddy : వైసీపీ ఎంపీకి బిగ్ షాక్ తగిలింది. ఎంపీకి ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కావాలని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కాగా, వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు, తయారీల అవకతవకలు జరిగాయి. ఇందులో వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ప్రమేయం ఉందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కావాలంటూ బెయిల్ కోసం […]
RK Roja : ఏపీలో కూటమి సర్కారుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. కూటమి పాలనలో తిరుమల పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అక్రమాలను భగవంతుడు గమనిస్తున్నాడన్నారు. ఇవాళ ట్విటర్లో కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పట్టడం లేదని విమర్శించారు. సంప్రదాయం ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలన్నారు. అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసం కూడా అవసరమని పేర్కొన్నారు. సంప్రదాయాలను పాటిస్తే […]
Kakani : వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు దొరకడం లేదు. ఆదివారం నెల్లూరులోని ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు తీసుకొని వెళ్లారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. మరోవైపు హైదరాబాద్లో ఉన్నట్లు సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలుసుకున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. […]
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]
Vidadala Rajini : గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని ఇవాళ మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని ఆరోపణలు చేశారు. ఎంపీ వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం, తన మరిదిని కూడా వివాదంలోకి […]
Botsa Satyanarayana: విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ప్లాన్ను తిప్పికొట్టేందుకు వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన మేయర్ను పదవి నుంచి […]
Marri Rajasekhar : త్వరలోనే టీడీపీలో చేరతానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, మోసం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్లో ఉన్న తాను 2011లో వైసీపీలో చేరినట్లు చెప్పారు. 14 ఏళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేననట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం ఖాయం అనుకుంటున్న వేళ […]