Home / YCP leaders
Kakani Govardhan Reddy : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన మరో నేత చిక్కుల్లో పడ్డారు. క్వార్జ్ ఖనిజం తరలించారనే ఫిర్యాదుతో నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్లో లీజు ముగిసినా క్వార్జ్ తరలించారని ఆరోపణలు వచ్చాయి. మైన్స్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రూ.250 కోట్ల విలువైన క్వార్జ్ తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకాణి సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు […]
Vidadala Rajini : గుంటూరు జిల్లా రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. మాజీ మంత్రి విడదల రజిని ఇవాళ మీడియాతో మాట్లాడారు. తనపై అక్రమ కేసులు పెట్టించారని, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలే కుట్రకు దర్శకుడని ఆరోపణలు చేశారు. ఎంపీ వ్యాపార లావాదేవీలకు సహకరించమని తనపై ఒత్తిడి తెచ్చారని, అంగీకరించకపోవడంతో తప్పుడు కేసులు పెట్టించారని విమర్శించారు. తనపై అక్రమ కేసులు పెట్టించి, రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ కుటుంబం, తన మరిదిని కూడా వివాదంలోకి […]
Botsa Satyanarayana: విశాఖలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకూ మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమి ప్రభుత్వం, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టి వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నాయి. ప్లాన్ను తిప్పికొట్టేందుకు వైసీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన మేయర్ను పదవి నుంచి […]
Marri Rajasekhar : త్వరలోనే టీడీపీలో చేరతానని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ వైఖరి, మోసం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్లో ఉన్న తాను 2011లో వైసీపీలో చేరినట్లు చెప్పారు. 14 ఏళ్లు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేననట్లు తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం ఖాయం అనుకుంటున్న వేళ […]
Vallabhaneni Vamsi : వైసీపీ నేత వల్లభనేని వంశీని పీటీ వారెంట్పై అరెస్టు చేసి గన్నవరం కోర్టులో హాజరు పర్చారు. విచారణ చేసిన న్యాయస్థానం ఏప్రిల్ 1 వరకు వంశీకి రిమాండ్ విధించింది. అనంతరం గన్నవరం కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయి విజయవాడ జిల్లా జైలులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు పీఎస్ పరిధిలో ఓ […]
Case filed Against YCP MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కూటమి ప్రభుత్వం నగదు చెల్లిస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు నాయుడు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఇటీవల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు […]
Police Notice To YCP Ex MP Gorantla Madhav: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, విచారణకు రావాలంటూ అనంతపురం మాజీ ఎంపీ, వైసీసీ నేత గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడు నెలల క్రితం సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతోపాటు మీడియా సమావేశంలో అత్యాచార బాధితురాలి పేరు వెల్లడించారని గతేడాది నవంబర్ 2న వాసిరెడ్డి పద్మ విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా మాధవ్పై […]
Former MLA Vallabhaneni Vamsi arrested in Hyderabad: గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయనను విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్తో పాటు పలువురిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1). 308, 351(3), […]
పిఠాపురంలో జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎర్రకండువా అనేది జనసేన జెండా కాదని ఆయన స్పష్టం చేశారు. మంగళ వారం పిఠాపురంలో జరిగిన ప్రెస్ మీట్ లో నాగబాబు మాట్లాడారు . పవన్ వేసుకున్నారు కాబట్టే దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు.
ఎంపీగా అవినాష్రెడ్డి విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు షర్మిల . హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.