Home / TDP
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ఫోన్ పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆధారాలు మాయం చేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఏపీ సీఎం జగన్ సోమవారం నరసాపురం పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చెట్లు నరికివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
కర్నూలులో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. ఉదయం రాజ్ విహార్ సర్కిల్ సమీపంలోని మౌర్య ఇన్ హోటల్ లో జరిగిన చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని న్యాయవాదులు అడ్డుకునేందుకు యత్నించారు.
సీఎం జగన్ ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభిరాం వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు
ఫైనాన్స్ మినిస్టర్ అప్పు చెయ్యకపోతే ఎవరు చేస్తారు ? హోమ్ మంత్రి చేస్తారా అంటూ ఏపీ ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటనలో చేసిన విమర్శల పై ఆయన స్పందించారు.
2024 ఎన్నికలు తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు చెప్పినట్టుగా జరుగుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు జరుగుతుందన్నారు.
మార్కెట్లో కిలో 20 రూపాయలకు పైనే అమ్ముతున్న టమోటా, రైతు దగ్గర కిలో రూ.1కే కొంటుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు.