Home / Sri Lanka
Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో రిచా ఘోష్ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెమీమా రోడ్రిగ్స్ 37, ప్రతీక […]
Sri Lankan flight departing from Chennai to Colombo : చెన్నై నుంచి కొలంబోకు బయలుదేరిన శ్రీలంక విమానంలో ఐదుగురు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్లు ఈమెయిల్ అందింది. వెంటనే చెన్నై విమానాశ్రయం అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో శ్రీలంకను అలర్టు చేశారు. కొలంబో చేరుకున్న విమానంలోని ప్రయాణికులను తనిఖీ చేశారు. శనివారం ఉదయం 11.5 గంటలకు చెన్నై విమానాశ్రయం చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఈమెయిల్ వచ్చింది. చెన్నై నుంచి కొలంబో వెళ్లే శ్రీలంక […]
Sri Lanka Gives shock to India: భారత్కు శ్రీలంక భారీ షాక్నిచ్చింది. ఇండియాకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇరుదేశాలు మంచి సత్ససంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఇటీవల ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం చేసింది. అయితే శ్రీలంక ప్రభుత్వం భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ధోరణిని కొనసాగిస్తూ.. శ్రీలంక మరోసారి ఇండియాను ఆశ్చర్యపరిచింది. భారత్-శ్రీలంక రక్షణ సంబంధాలకు ఇటీవల ఎదురుదెబ్బ తగులగా, ఈ నేపథ్యంలో […]
PM Modi SriLanka Visit : మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శ్రీలంకకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమిళ జాలర్ల సమస్యను లేవనెత్తారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వద్ద ప్రస్తావించారు. తమిళ జాలర్లను తక్షణమే విడుదల చేసి, వారి పడవలను విడిచిపెట్టాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఈ అంశం పెండింగ్లో ఉంది. సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. […]
Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడితో బాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉపమంత్రి అనిల్ జయంత ఫెర్నాండో తదితరులు పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం […]
శ్రీలంకను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. చెట్లు కూలిపడ్డంతో సుమారు 15 మందిమృతి చెందారని శ్రీలంక డిజాస్టర్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. భారీ వరదలకు దేశ రాజధాని కొలంబోలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు నీట మునిగిపోయారు.
ఆదివారం ప్రపంచ కప్ లో శ్రీలంక జట్టు బారత్ చేతిలో ఘోరపరాజయం పాలయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే జాతీయ క్రికెట్ బోర్డును రద్దు చేసారు. శ్రీలంక క్రికెట్ బోర్డు నమ్మక ద్రోహం మరియు అవినీతితో కలుషితమయిపోయిందని ఆయన ఆరోపించారు. వెంటనే బోర్డు సభ్యలు రాజీనామా చేయాలని ఆదేశించారు.
కష్టాల్లో ఉన్న తన పర్యాటక రంగాన్ని పెంపొందించడానికి శ్రీలంక తన పొరుగు దేశం భారతదేశం వైపు చూస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో, రామాయణ సర్క్యూట్ భారతదేశం నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షించగలదని శ్రీలంక వాసులు గ్రహించారు మరియు వారు దానిని చురుకుగా ప్రచారం చేస్తున్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్ ) శ్రీలంక యొక్క దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను రక్షించడంలో సహాయపడటానికి నాలుగు సంవత్సరాలలో దేశం కోసం దాదాపు $3 బిలియన్ల బెయిలౌట్ కార్యక్రమాన్ని ఆమోదించింది. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపిందని ఐఎంఎఫ్ సోమవారం ప్రకటించింది.
శ్రీలంక విద్యుత్ బోర్డు విద్యుత్ చార్జీలను ఏకంగా 275 శాతం వరకు పెంచింది. దేశ ఆర్దిక వ్యవస్ద దివాలా తీయడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని ఇంధన శాఖ మంత్రి కాంచన విజేశేఖర్ అన్నారు