Home / sajjala ramakrishna reddy
బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై నెక్స్ట్ లెవెల్ లో ఆయన ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని
టీడీపీ డ్రామాలు పీక్స్కి చేరాయని అందులో భాగంగానే చంద్రబాబుకు ముప్పు ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తప్పు చేసినట్లు ఆధారాలున్నాయని కోర్టు ధ్రువీకరించిందని అన్నారు.
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా నమ్మకం కోల్పోయిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ఆలోచన..చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని పొత్తు లేని చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు.
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా హస్తినకు పయనమయ్యారని.. ఆ విషయమై ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్డింగ్ వేస్తోందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలు .. మరోవైపు సస్పెండ్ చేయబడ్డ రెబల్ ఎమ్మెల్యేలతో మాటల యుద్ధం నడుస్తుంది. ఈ మేరకు తాజాగా వైసీపీ అధినాయకత్వంపై ఎమ్యెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను క్రాస్ ఓటింగ్ చేశాననేది నామీద బురద జల్లడమే అంటూ ఫైర్ అయ్యారు.
ఏపీలో రాజకీయాలు విమర్శలు.. ప్రతి విమర్శలతో హీట్ పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తరుణంలో మొదలైన ఈ ధోరణి.. ఇటీవల 4 వైకాపా ఏమమెలఎఎలను సస్పెండ్ చేయడంతో మరింత జోరందుకుంది. కాగా తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ తెలుగుదేశం పార్టీవి కావని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్ధాయిలో స్పందించారు.