Home / Revanth Reddy
తెలంగాణ ప్రజల ఆకాంక్షను సీఎం కేసిఆర్ చంపేశారని, తెలంగాణ పేరుతో ఆర్ధిక బలవంతుడుగా మారాడని టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు
భారత జోడో యాత్రలో కాంగ్రెస్ నేతలను ప్రచారానికి రాకుండా అడ్డుకొనేందుకు భాజపా ఎత్తుగడలను వేస్తుందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు
రాహుల్ గాంధీ సారధ్యంలో సాగుతున్న కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కేవలం ఎన్నికల కోసమే కాదని, దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్రంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు
ఇంటగెలిచి రచ్చ గెలవమన్న సామెత ఉంది. దీనిని కేసీఆర్ నిజం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎం అయ్యారు. అంటే ఇంట గెలిచారు. దీనితో గులాబీ సారు ఇక ఢిల్లీ పై దృష్టి సారించారు.
మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నోటిఫికేషన్ కూడా రాలేదు. కానీ రాజకీయపార్టీలన్నీ మునుగోడుపై ఫుల్ ఫోకస్ చేశాయి. ప్రధాన పార్టీలకు అక్కడ గెలుపు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్ధితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుంది. ఆయన తీసుకొనే నిర్ణయాలు సీనియర్లకు ఇష్టం లేని కారణంగా ప్రతి విషయాన్ని రాద్ధాంతం దిశగా వారు నడిపిస్తున్నారు
మునుగోడులో రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా ఆయన ఈ విధంగా ప్రతిపక్ష పార్టీల పై మండిపడుతూ ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు కలిపి గొయ్యి తీసి దానిలో బొందపెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రతో భాజాపా దేశంలో పెద్ద చర్చనే లేవదీసింది. అది కాస్తా రాష్ట్రాలకు కూడా పాకింది. తాజాగా తెలంగాణ శాసనసభా ప్రాంగణంలో కాంగ్రెస్ శాసనసభ్యులు జగ్గారెడ్డి వేసుకొన్న షర్ట్ పై ఆసక్తికర సంభాషణ సాగింది.
కాంగ్రెస్ తరుఫున మునుగోడు అభ్యర్థి ఎవరో తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. ఇన్నాళ్లు అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారో తెలియక అయోమయానికి గురవుతున్న కేడర్ కు ఏఐసీసీ స్పష్టత ఇచ్చింది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణా రెడ్డి కలిశారు. మునుగోడు అభ్యర్థిగా పార్టీ అధిష్టానం స్రవంతిని ఎంపిక చేసిన నేపథ్యంలో కలిసి పని చేయాలని వారికి సూచించారు.